గొప్పలు చెప్పిన రోజా ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నారు?: అనిత
- దిశ చట్టం గురించి రోజా చాలా గొప్పగా చెప్పారు
- యువతులు బలవుతుంటే మౌనంగా ఉంటున్నారు
- వైసీపీది ప్రచార ఆర్భాటం మాత్రమే
ముఖ్యమంత్రి జగన్ నివాసానికి కూతవేటు దూరంలోనే వారం వ్యవధిలో ఇద్దరు యువతులు ఉన్మాదుల చేతిలో బలయ్యారని... రాష్ట్రంలో రక్షణ వ్యవస్థ ఏమైందని ప్రశ్నించారు. దిశ చట్టం గురించి వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో చాలా గొప్పగా చెప్పారని... ఇప్పుడు ఆమె నోరు మెదపకుండా మౌనంగా ఎందుకుంటున్నారని మండిపడ్డారు.