సుశాంత్ ఘటన అనంతరం 'ఆత్మహత్య'పై కదిలిన తారాలోకం
- ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ప్రచారం
- కౌన్సెలింగ్ కేంద్రాల ఫోన్ నెంబర్లను ట్విట్టర్ లో పంచుకుంటున్న తారలు
- ఒక్కొక్కరు ఇద్దర్ని నామినేట్ చేస్తూ చైతన్యం కలిగించే యత్నం
ఈ అంశంపై దర్శకుడు దేవా కట్టా పోస్టు చేసి హీరో సాయితేజ్ ను నామినేట్ చేశాడు. సాయితేజ్ దీనిపై స్పందిస్తూ, తన వంతుగా వెన్నెల కిశోర్, లావణ్య త్రిపాఠిలను నామినేట్ చేశాడు. ఆపై లావణ్య త్రిపాఠి ఈ చాలెంజ్ ను స్వీకరిస్తూ, మన బాధలు వినేవాళ్లు ఎవరో ఒకరు తప్పకుండా ఉంటారు అంటూ పోస్ట్ చేశారు. ఈ చాలెంజ్ లో భాగంగా రీతూ వర్మ, రాహుల్ రవీంద్రన్ లను నామినేట్ చేశారు.