రేపిస్టుల మద్దతుదారుడు: కొత్త విద్యామంత్రిపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
- కొత్త విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలను జోషి గతంలో సమర్ధించడమే కారణం
- రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ
కేంద్ర విద్యాశాఖ నూతన మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియామకంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జోషిని రేపిస్టుల మద్దతుదారుడి అభివర్ణిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలను గతంలో సమర్థించిన వ్యక్తికి కీలకమైన విద్యాశాఖను ఎలా అప్పగిస్తారని ఆయన ప్రశ్నించారు.
మంగళవారం పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, "నేరస్తులను సమర్థించే వ్యక్తి కంటే నీచమైన వ్యక్తి మరొకరు ఉండరు. ప్రహ్లాద్ జోషి నియామకం మన విద్యా వ్యవస్థకు, ప్రతి విద్యార్థికి అవమానకరం" అని వ్యాఖ్యానించారు. క్యాబినెట్లో ఇతర సమర్థులైన మంత్రులు ఉండగా, జోషినే ఎందుకు ఎంచుకున్నారో ప్రధాని సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు.
రాహుల్ సోదరి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా సైతం లోక్సభలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. గర్భిణిపై అత్యాచారం చేసిన వారి విడుదలను సమర్థించిన వ్యక్తికి కీలక పదవి ఇవ్వడం ద్వారా దేశంలోని కోట్ల మంది విద్యార్థినులకు ప్రధాని ఎటువంటి సందేశం పంపుతున్నారని ఆమె ప్రశ్నించారు.
నీట్ పరీక్ష పత్రాల లీకేజీ ఆరోపణలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ బాధ్యతలను అప్పగించారు. 2018లో గుజరాత్ ప్రభుత్వం బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను విడుదల చేయగా, అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న జోషి ఆ నిర్ణయాన్ని సమర్థించారు. దోషులు జైలులో సుదీర్ఘ కాలం గడిపారని, వారి ప్రవర్తన బాగుందని ఆయన పేర్కొనడం అప్పట్లో వివాదాస్పదమైంది. అయితే, 2024లో సుప్రీంకోర్టు ఈ విడుదలను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
మరోవైపు, కాంగ్రెస్ విమర్శలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. లోక్సభలో ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిత్వ హననం కిందకు వస్తాయని ఆరోపించింది. ట్రెజరీ బెంచీల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో, స్పీకర్ ఓం బిర్లా ఆమె ప్రసంగంలోని కొన్ని భాగాలను సభ రికార్డుల నుంచి తొలగించాలని ఆదేశించారు.
మంగళవారం పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, "నేరస్తులను సమర్థించే వ్యక్తి కంటే నీచమైన వ్యక్తి మరొకరు ఉండరు. ప్రహ్లాద్ జోషి నియామకం మన విద్యా వ్యవస్థకు, ప్రతి విద్యార్థికి అవమానకరం" అని వ్యాఖ్యానించారు. క్యాబినెట్లో ఇతర సమర్థులైన మంత్రులు ఉండగా, జోషినే ఎందుకు ఎంచుకున్నారో ప్రధాని సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు.
రాహుల్ సోదరి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా సైతం లోక్సభలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. గర్భిణిపై అత్యాచారం చేసిన వారి విడుదలను సమర్థించిన వ్యక్తికి కీలక పదవి ఇవ్వడం ద్వారా దేశంలోని కోట్ల మంది విద్యార్థినులకు ప్రధాని ఎటువంటి సందేశం పంపుతున్నారని ఆమె ప్రశ్నించారు.
నీట్ పరీక్ష పత్రాల లీకేజీ ఆరోపణలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ బాధ్యతలను అప్పగించారు. 2018లో గుజరాత్ ప్రభుత్వం బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను విడుదల చేయగా, అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న జోషి ఆ నిర్ణయాన్ని సమర్థించారు. దోషులు జైలులో సుదీర్ఘ కాలం గడిపారని, వారి ప్రవర్తన బాగుందని ఆయన పేర్కొనడం అప్పట్లో వివాదాస్పదమైంది. అయితే, 2024లో సుప్రీంకోర్టు ఈ విడుదలను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
మరోవైపు, కాంగ్రెస్ విమర్శలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. లోక్సభలో ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిత్వ హననం కిందకు వస్తాయని ఆరోపించింది. ట్రెజరీ బెంచీల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో, స్పీకర్ ఓం బిర్లా ఆమె ప్రసంగంలోని కొన్ని భాగాలను సభ రికార్డుల నుంచి తొలగించాలని ఆదేశించారు.