ఫేస్‌బుక్, గూగుల్, ఎక్స్‌లకు కేంద్రం సమన్లు

Centre issues summons to Facebook Google and X
  • ఆగస్టు 3న సోషల్ మీడియా ప్రతినిధులతో భేటీ
  • మెటా, గూగుల్, ఎక్స్, స్నాప్‌చాట్ ప్రతినిధులు హాజరుకావాలని నోటీసులు
  • ప్రధాని వీడియో తొలగింపు వివాదం నేపథ్యంలో కీలక పరిణామం
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నియంత్రణ, వినియోగదారుల గోప్యత వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్), గూగుల్, ఎక్స్, స్నాప్‌చాట్ వంటి దిగ్గజ సంస్థలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 3న నిర్వహించనున్న పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరై, సంబంధిత అంశాలపై వివరణ ఇవ్వాలని సోషల్ మీడియా ప్రతినిధులను ఆదేశించింది.

కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సమావేశానికి టెక్ కంపెనీల ప్రతినిధులతో పాటు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మరియు హోం మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు కూడా హాజరై కమిటీకి వివరాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు. ప్రజల, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, రైతుల సమాచార భద్రతకు తీసుకుంటున్న చర్యలతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణకు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారో వివరించాలని కంపెనీలను కోరినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇటీవల పరీక్ష పత్రాల లీకేజీ, సంస్కరణలపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన వీడియోను ఫేస్‌బుక్ కొద్దిసేపు తొలగించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సాంకేతిక లోపం వల్లే ఈ పొరపాటు జరిగిందని మెటా వివరణ ఇచ్చింది. ఈ వివాదం మరియు విద్యార్థుల నిరసనల నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగంపై విస్తృత చర్చ జరుగుతున్న తరుణంలో పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Advertisement
Parliamentary Standing Committee
Meta
Google
Nishikant Dubey
Social Media Regulation
User Privacy

More Telugu News