‘35 ఏ అధికరణం’పై పిటిషన్లు.. రేపటి నుంచి ‘సుప్రీం’లో విచారణ
- రేపటి నుంచి 28వ తేదీ వరకు మరోసారి విచారణ
- జమ్ముకశ్మీర్ కు సంబంధించిన 35 ఏ అధికరణం
- ‘35 ఏ’ను రాజ్యాంగంలో చేర్చడంపై పిటిషన్లు
అయితే, పార్లమెంట్ ఆమోదం పొందని ఈ అధికరణాన్ని రాజ్యాంగంలో చేరుస్తున్నట్టు నాటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ అధికరణం చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు.
ఇదిలా ఉండగా, 35 ఏ అధికరణం ద్వారా రాష్ట్ర శాసనసభ తీసుకునే ఏ నిర్ణయాన్ని సవాల్ చేసే ఆస్కారం ఉండదు. ఈ అధికరణం ద్వారా శాశ్వత పౌరులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి, రాష్ట్రంలో ఆస్తులు కొనుగోలు చేయడానికి, స్కాలర్ షిప్స్, సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హులు.