VVS Laxman: ఈడెన్ గార్డెన్స్ అద్భుతానికి 25 ఏళ్లు.. ఆనాటి భాగస్వామ్యాన్ని గుర్తుచేసుకున్న లక్ష్మణ్
భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన ఈడెన్ గార్డెన్స్ అద్భుతానికి నేటితో 25 ఏళ్లు పూర్తయ్యాయి. 2001లో ఆస్ట్రేలియాపై ఫాలో ఆన్ ఆడుతూ టీమిండియా సాధించిన ఈ చారిత్రక విజయం టెస్టు క్రికెట్ చరిత్రలోనే గొప్ప పునరాగమనాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని, ఆ విజయంలో కీలకపాత్ర పోషించిన మాజీ బ్యాటర్, ప్రస్తుత బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.
2001 మార్చి 14న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో నాలుగో రోజు ఆట ప్రారంభమయ్యే సమయానికి భారత్ ఓటమి అంచున ఉంది. తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన టీమిండియా, రెండో టెస్టులో ఫాలో ఆన్ ఆడుతోంది. నాలుగో రోజు ఉదయం భారత్ స్కోరు 254/4. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 20 పరుగులు వెనుకబడే ఉంది. చేతిలో ఆరు వికెట్లు మాత్రమే ఉండటంతో ఆసీస్ విజయం లాంఛనమేనని అందరూ భావించారు.
అయితే, ఓవర్నైట్ స్కోరు 109 పరుగులతో క్రీజులో ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ అసాధారణమైన పోరాటాన్ని ప్రదర్శించాడు. అతనితో పాటు రాహుల్ ద్రవిడ్ కూడా అద్భుతంగా నిలిచాడు. ఈ ఇద్దరూ కలిసి ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ భారత స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. లక్ష్మణ్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి టెస్ట్ క్రికెట్ గతిని మార్చేశాడు.
ఈ చారిత్రక భాగస్వామ్యంపై లక్ష్మణ్ 'ఎక్స్' వేదికగా స్పందించాడు. "25 ఏళ్ల క్రితం ఈడెన్ గార్డెన్స్లో నేను, రాహుల్ పంచుకున్న భాగస్వామ్యం ఎప్పటికీ ప్రత్యేకం. ఓటమి ఖాయమనుకున్న దశలో మేం నమ్మకం, సహనం, పట్టుదలను ఎంచుకున్నాం. ఆ భాగస్వామ్యం కేవలం పరుగుల గురించి మాత్రమే కాదు, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం, టీమ్వర్క్, ప్రతి సెషన్ కోసం పోరాడటం గురించి. రాహుల్తో కలిసి ఆ ప్రయాణంలో పాలుపంచుకున్నందుకు గర్వంగా ఉంది. క్రికెట్లో పునరాగమనాలు ఎప్పుడైనా సాధ్యమేనని గుర్తుచేసిన టెస్టు అది" అని ద్రవిడ్తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ లక్ష్మణ్ పేర్కొన్నాడు.
ఆ చారిత్రక ఇన్నింగ్స్లో లక్ష్మణ్ 281 పరుగుల వద్ద ఔటయ్యాడు. అప్పటికి ఇదే ఓ భారత బ్యాటర్ చేసిన అత్యధిక టెస్ట్ స్కోరు. మరోవైపు ద్రవిడ్ 180 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. భారత్ తమ రెండో ఇన్నింగ్స్ను 657/7 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 212 పరుగులకే కుప్పకూలింది. హర్భజన్ సింగ్ ఆరు వికెట్లతో చెలరేగి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
2001 మార్చి 14న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో నాలుగో రోజు ఆట ప్రారంభమయ్యే సమయానికి భారత్ ఓటమి అంచున ఉంది. తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన టీమిండియా, రెండో టెస్టులో ఫాలో ఆన్ ఆడుతోంది. నాలుగో రోజు ఉదయం భారత్ స్కోరు 254/4. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 20 పరుగులు వెనుకబడే ఉంది. చేతిలో ఆరు వికెట్లు మాత్రమే ఉండటంతో ఆసీస్ విజయం లాంఛనమేనని అందరూ భావించారు.
అయితే, ఓవర్నైట్ స్కోరు 109 పరుగులతో క్రీజులో ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ అసాధారణమైన పోరాటాన్ని ప్రదర్శించాడు. అతనితో పాటు రాహుల్ ద్రవిడ్ కూడా అద్భుతంగా నిలిచాడు. ఈ ఇద్దరూ కలిసి ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ భారత స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. లక్ష్మణ్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి టెస్ట్ క్రికెట్ గతిని మార్చేశాడు.
ఈ చారిత్రక భాగస్వామ్యంపై లక్ష్మణ్ 'ఎక్స్' వేదికగా స్పందించాడు. "25 ఏళ్ల క్రితం ఈడెన్ గార్డెన్స్లో నేను, రాహుల్ పంచుకున్న భాగస్వామ్యం ఎప్పటికీ ప్రత్యేకం. ఓటమి ఖాయమనుకున్న దశలో మేం నమ్మకం, సహనం, పట్టుదలను ఎంచుకున్నాం. ఆ భాగస్వామ్యం కేవలం పరుగుల గురించి మాత్రమే కాదు, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం, టీమ్వర్క్, ప్రతి సెషన్ కోసం పోరాడటం గురించి. రాహుల్తో కలిసి ఆ ప్రయాణంలో పాలుపంచుకున్నందుకు గర్వంగా ఉంది. క్రికెట్లో పునరాగమనాలు ఎప్పుడైనా సాధ్యమేనని గుర్తుచేసిన టెస్టు అది" అని ద్రవిడ్తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ లక్ష్మణ్ పేర్కొన్నాడు.
ఆ చారిత్రక ఇన్నింగ్స్లో లక్ష్మణ్ 281 పరుగుల వద్ద ఔటయ్యాడు. అప్పటికి ఇదే ఓ భారత బ్యాటర్ చేసిన అత్యధిక టెస్ట్ స్కోరు. మరోవైపు ద్రవిడ్ 180 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. భారత్ తమ రెండో ఇన్నింగ్స్ను 657/7 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 212 పరుగులకే కుప్పకూలింది. హర్భజన్ సింగ్ ఆరు వికెట్లతో చెలరేగి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.