నారావారిపల్లెలో మంత్రి లోకేశ్... బాబాయికి ఘన నివాళి
- నారా రామ్మూర్తినాయుడు ప్రథమ వర్థంతి కార్యక్రమం
- నారావారిపల్లెలో సంవత్సరీకం... పాల్గొన్న మంత్రి నారా లోకేశ్
- స్మృతివనం వద్ద బాబాయికి నివాళులు అర్పించిన వైనం
- హాజరైన నారా, నందమూరి కుటుంబ సభ్యులు
- పాల్గొన్న టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు
మంగళవారం ఉదయం నారావారిపల్లెలోని తమ నివాసంలో రామ్మూర్తినాయుడు ప్రథమ వర్థంతికి సంబంధించి నిర్వహించిన ప్రత్యేక క్రతువులో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. అనంతరం, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి గ్రామంలోని రామ్మూర్తినాయుడు స్మృతివనం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆయన సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. తన బాబాయిని స్మరించుకుంటూ కొంతసేపు మౌనం పాటించారు.
ఈ కార్యక్రమంలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా హాజరై దివంగత రామ్మూర్తినాయుడికి నివాళులర్పించారు.



