తెలంగాణలో ఆర్థిక సంక్షోభం రాబోతుందంటూ కేంద్రమంత్రి హెచ్చరిక
- కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కిషన్ రెడ్డి మండిపాటు
- ప్రస్తుత పరిస్థితుల్లో హామీలను అమలు చేసే పరిస్థితి కూడా లేదన్న కేంద్రమంత్రి
- ఉద్యోగులకు కనీసం వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని వ్యాఖ్య
తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో హామీలు అమలు చేసే పరిస్థితి కూడా లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ, మహిళలకు తులం బంగారం, నిరుద్యోగ భృతి తదితర ఏ హామీలను నెరవేర్చలేదన్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు కనీసం వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థికస్థితి ఉందన్నారు.