జగ్గారెడ్డి గెలవడు కానీ... ముఖ్యమంత్రి అవుతాడట: హరీశ్ రావు సెటైర్లు
- జానారెడ్డి పోటీ కూడా చేయడం లేదు... సీఎం అవుతానని చెబుతున్నాడన్న హరీశ్ రావు
- కాంగ్రెస్ పార్టీలో పదిమంది ముఖ్యమంత్రులు ఉన్నారని ఎద్దేవా
- బీఆర్ఎస్ హయాంలో కర్ఫ్యూలేని తెలంగాణను చూస్తున్నామన్న మంత్రి
తెలంగాణలో పదిహేడువేల మంది ఇమామ్లకు నెలకు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యనే ఉన్నారని తెలిపారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ వచ్చిందని, నర్సింగ్ కాలేజీ వచ్చిందని తెలిపారు. మళ్లీ గెలిచిన తర్వాత రూ.2 కోట్లతో సంగారెడ్డి, సదాశివపేటలలో మైనార్టీలకు షాదీఖానా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.