Nara Lokesh: ​​బలిజలు జగన్ చేతిలో బాధితులుగా మారారు: నారా లోకేశ్

  • మైదుకూరు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • యువగళంలో భాగంగా భూమయ్యపల్లెలో బలిజలతో లోకేశ్ ముఖాముఖి
  • గతంలో కాపులకు అమలు చేసిన రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్నామని వెల్లడి
  • అభివృద్ధికి కేరాఫ్ అడ్రెస్ టీడీపీయేనని ఉద్ఘాటన 
Lokesh held meeting with Kapu community people

రాయలసీమలో బలిజలను ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకురావడానికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీయేనని నారా లోకేశ్ పేర్కొన్నారు. మైదుకూరు నియోజకవర్గం భూమయ్యపల్లెలో బలిజ సామాజికవర్గీయులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బలిజలు జగన్ చేతిలో బాధితులుగా మారారని తెలిపారు. రాయలసీమలో బలిజల్ని జగన్ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని,. తన పిల్లలు విదేశాల్లో చదివితే చాలు పేద విద్యార్థులు విదేశాల్లో చదవకూడదు అనే ఆలోచనలో జగన్ విదేశీ విద్య పథకం రద్దు చేశారని విమర్శించారు.

గతంలో కాపులకు అమలు చేసిన రిజర్వేషన్ కి టీడీపీ కట్టుబడి ఉందని లోకేశ్ స్పష్టం చేశారు. జగన్ కక్షతో కాపు కార్పొరేషన్ ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. పేదరికానికి కులం, మతం, ప్రాంతం ఉండవని, బలిజలకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇస్తాం అని హామీ ఇచ్చారు. 

అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ

అభివృద్దికి కేర్ ఆఫ్ అడ్రస్ టీడీపీ అని లోకేశ్ స్పష్టం చేశారు. యువతను క్రీడల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని తెలిపారు. 

"టీడీపీ రాజంపేట పార్లమెంటు నుండి 12 సార్లు బలిజ వ్యక్తిని పార్లమెంటుకు పంపిస్తే, జగన్ రెడ్డి రాజంపేట ఎంపీ సీటును మిథున్ రెడ్డికి కట్టబెట్టి బలిజలను వంచించారు. తిరుపతి అసెంబ్లీ సీటును తెలుగుదేశం పార్టీ బలిజలకు కేటాయిస్తే, జగన్ రెడ్డి సొంత వర్గానికి కట్టబెట్టాడు. 

బలిజ వర్గానికి చెందిన సి.రామచంద్రయ్యకు రెండుసార్లు రాజ్యసభ్యుడిగా అవకాశం కల్పించాం. పసుపులేటి బ్రహ్మయ్యకు మంత్రి పదవి ఇచ్చాం. చదలవాడ కృష్ణమూర్తిని టీటీడీ ఛైర్మన్ గా నియమించాం. 

బి.కె.సత్యప్రభకు ఎమ్మెల్యే సీటు ఇచ్చి, ఆమె భర్త ఆదికేశవులు నాయుడుని ఎంపీ చేశాం. విద్యా, ఉద్యోగాల కల్పనలో రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ మేరకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. వైఎస్ గారు రిజర్వేషన్ ఇస్తానని ఇవ్వలేదు. జగన్ ఏకంగా కాపులకు ఇచ్చిన రిజర్వేషన్లు కట్ చేశాడు" అని లోకేశ్ పేర్కొన్నారు.

కాపులకు రూ.3,100 కోట్లు ఖర్చుచేశాం!

టీడీపీ అధికారంలో ఉండగా కాపు కార్పొరేషన్‌ ద్వారా రూ.3100 కోట్లు ఖర్చు చేశామని లోకేశ్ వెల్లడించారు. ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణ పథకం ద్వారా 4,528 మంది విద్యార్ధుల్ని విదేశాల్లో చదివించామని, ఎన్టీఆర్‌ ఉన్నత విద్యా పథకం ద్వారా రూ.28.26 కోట్లతో 1,413 మంది విద్యార్ధులకు లబ్ది చేకూర్చామని వివరించారు. 

"కాపు కార్పొరేషన్‌ ద్వారా రూ.66.50 కోట్లు రుణాలుగా ఇచ్చాం. 33,594 మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చాం. ఉప ముఖ్యమంత్రి పదవిని కాపులకిచ్చాం. ప్రతి జిల్లాలో రూ.5 కోట్లతో కాపు భవన్‌లను నిర్మించాం. కాపు కార్పొరేషన్‌ రుణాలకు చేసుకున్న 47 వేలకు పైగా దరఖాస్తులను రద్దు చేశారు. కాపులకు కల్పించిన రిజర్వేషన్‌ను రద్దు చేయడం ద్వారా ఉద్యోగాలు కోల్పోయారు. స్కూళ్లు, కాలేజీల్లో రిజర్వేషన్ల ప్రాతిపదికన అందించే వేలాది సీట్లు కాపు విద్యార్ధులు కోల్పోయారు" అని లోకేశ్ వివరించారు.

కాపు భవన్ లను నిలిపేశారు!

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాపు భవన్‌ల నిర్మాణానికి రూ.165 కోట్లు కేటాయిస్తే... జగన్ రెడ్డి ఆ నిర్మాణాలను సైతం పూర్తి చేయకుండా ఆపేశాడని లోకేశ్ ఆరోపించారు. కాపులకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలైన అన్ని పథకాలు రద్దు చేశారని తెలిపారు.

కాపు నేస్తం అంటూ... అన్ని వర్గాల్లోని మహిళలకు ఇచ్చే పథకాన్నే కాపులకు ప్రత్యేకంగా ఇస్తున్నట్లు చెబుతున్నారని విమర్శించారు. రైతు భరోసా పథకాన్ని కాపులకు దూరం చేసి... రైతుల్ని కూడా కులాల వారీగా విడగొట్టారంటూ లోకేశ్ మండిపడ్డారు. జగన్ కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఒక్క రూపాయి రుణం ఇవ్వలేదని అన్నారు.

యువగళం వివరాలు

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1493.6 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 13.1 కి.మీ.*

*117 వరోజు పాదయాత్ర వివరాలు (5-6-2023)*

*కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం (కడప జిల్లా):*

సాయంత్రం

4.00 – చెన్నముక్కపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.10 – కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

4.55 – కొండపేటలో స్థానికులతో మాటామంతీ.

5.05 – కొండపేటలో స్థానికులతో సమావేశం.

5.15 – పెన్నా బ్రిడ్జి వద్ద స్థానికులతో మాటామంతీ.

5.30 – చెన్నూరు బస్టాండు వద్ద బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.

6.50 – చెన్నూరు పోలీస్ స్టేషన్ వద్ద స్థానికులతో సమావేశం.

7.00 – చెన్నూరు ఎల్లమ్మగుడి వద్ద స్థానికులతో సమావేశం.

7.10 – చెన్నూరు క్రాస్ వద్ద రైతులతో భేటీ.

7.15 – చెన్నూరు హజ్ హౌస్ వద్ద ముస్లింలతో సమావేశం.

7.35 – ఉప్పరపల్లి క్రాస్ వద్ద రైతులతో సమావేశం.

7.45 – రమణపల్లె క్రాస్ వద్ద స్థానికులతో భేటీ.

8.05 – చిన్నమాచుపల్లిలో రైతులతో సమావేశం.

8.25 – శేషయ్యవారిపల్లి వద్ద స్థానికులతో సమావేశం.

8.45 – శేషయ్యవారిపల్లి వద్ద దివ్యాంగులతో భేటీ.

9.00 – కడప అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం. ఐరన్ సర్కిల్ వద్ద స్థానికులతో మాటామంతీ.

9.15 – ఆలంఖాన్ పల్లిలో 1500 కి.మీ.కి చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.

10.15 –వినాయక్ నగర్ జంక్షన్ లో స్థానికులతో సమావేశం.

10.35 – కడప శివారు బిల్టప్ సర్కిల్ విడిది కేంద్రంలో బస.

******

More Telugu News