సచిన్ 37 ఏళ్ల రికార్డు బద్దలు.. 15 ఏళ్లకే ప్రపంచ రికార్డులు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ!
- జింబాబ్వేతో తొలి టీ20లో 18 బంతుల్లోనే విధ్వంసక హాఫ్ సెంచరీ
- అతి పిన్న వయసులో అర్ధశతకం బాదిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు
- క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 37 ఏళ్ల నాటి రికార్డు బద్దలు
- ఒకే ఇన్నింగ్స్తో పలు ప్రపంచ రికార్డులను తిరగరాసిన యువ కెరటం
భారత క్రికెట్లో యువ కెరటం వైభవ్ సూర్యవంశీ సంచలనాలు సృష్టిస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల 118 రోజుల వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్, తన నాలుగో మ్యాచ్లోనే ప్రపంచ రికార్డుల మోత మోగించాడు. జింబాబ్వేతో హరారే వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 37 ఏళ్ల నాటి రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్లో కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు.
ఇంగ్లండ్తో ఆడిన తొలి మూడు ఇన్నింగ్స్లలో 14, 13, 15 పరుగులతో నిరాశపరిచిన సూర్యవంశీ, జింబాబ్వేపై తన అసలైన ఆటను ప్రదర్శించాడు. ప్రత్యర్థి బౌలర్లు వేసిన పేలవమైన బంతులను చక్కగా వాడుకుంటూ బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. అయితే, ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. కానీ అప్పటికే, తన పేరును ప్రపంచ రికార్డుల పుస్తకాల్లో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.
సూర్యవంశీ సృష్టించిన ప్రపంచ రికార్డులు
ఈ ఇన్నింగ్స్తో సూర్యవంశీ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అతి పిన్న వయసులో (15 ఏళ్ల 118 రోజులు) హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు జిబ్రాల్టర్కు చెందిన లూయిస్ బ్రూస్ (16 ఏళ్ల 56 రోజులు) పేరిట ఉండేది. క్రిక్బజ్ సమాచారం ప్రకారం.. పూర్తిస్థాయి సభ్య దేశాల ఆటగాళ్లలో ఈ రికార్డు గతంలో ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ (17 ఏళ్ల 296 రోజులు) పేరిట ఉంది.
అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టీ20) కలిపి పూర్తిస్థాయి సభ్య దేశాల తరఫున అతి పిన్న వయసులో తొలి అర్ధశతకం నమోదు చేసిన ఆటగాడిగా సూర్యవంశీ నిలిచాడు. ఈ క్రమంలో 1989లో పాకిస్థాన్పై సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 213 రోజుల వయసులో నెలకొల్పిన రికార్డును సూర్యవంశీ బద్దలుకొట్టాడు. ఈ జాబితాలో షాహిద్ అఫ్రిది (16 ఏళ్ల 214 రోజులు), ముస్తాక్ మహ్మద్ (17 ఏళ్ల 39 రోజులు) వంటి దిగ్గజాలు ఉన్నారు.
అసోసియేట్ దేశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే, పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో 50+ స్కోరు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా సూర్యవంశీ నిలిచాడు. గతంలో నేపాల్ ఆటగాడు కుశల్ మల్లా 15 ఏళ్ల 340 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా, ఇప్పుడు సూర్యవంశీ ఆ రికార్డును కూడా అధిగమించి భారత క్రికెట్లో ఓ సరికొత్త అధ్యాయానికి నాంది పలికాడు.
ఇంగ్లండ్తో ఆడిన తొలి మూడు ఇన్నింగ్స్లలో 14, 13, 15 పరుగులతో నిరాశపరిచిన సూర్యవంశీ, జింబాబ్వేపై తన అసలైన ఆటను ప్రదర్శించాడు. ప్రత్యర్థి బౌలర్లు వేసిన పేలవమైన బంతులను చక్కగా వాడుకుంటూ బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. అయితే, ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. కానీ అప్పటికే, తన పేరును ప్రపంచ రికార్డుల పుస్తకాల్లో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.
సూర్యవంశీ సృష్టించిన ప్రపంచ రికార్డులు
ఈ ఇన్నింగ్స్తో సూర్యవంశీ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అతి పిన్న వయసులో (15 ఏళ్ల 118 రోజులు) హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు జిబ్రాల్టర్కు చెందిన లూయిస్ బ్రూస్ (16 ఏళ్ల 56 రోజులు) పేరిట ఉండేది. క్రిక్బజ్ సమాచారం ప్రకారం.. పూర్తిస్థాయి సభ్య దేశాల ఆటగాళ్లలో ఈ రికార్డు గతంలో ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ (17 ఏళ్ల 296 రోజులు) పేరిట ఉంది.
అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టీ20) కలిపి పూర్తిస్థాయి సభ్య దేశాల తరఫున అతి పిన్న వయసులో తొలి అర్ధశతకం నమోదు చేసిన ఆటగాడిగా సూర్యవంశీ నిలిచాడు. ఈ క్రమంలో 1989లో పాకిస్థాన్పై సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 213 రోజుల వయసులో నెలకొల్పిన రికార్డును సూర్యవంశీ బద్దలుకొట్టాడు. ఈ జాబితాలో షాహిద్ అఫ్రిది (16 ఏళ్ల 214 రోజులు), ముస్తాక్ మహ్మద్ (17 ఏళ్ల 39 రోజులు) వంటి దిగ్గజాలు ఉన్నారు.
అసోసియేట్ దేశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే, పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో 50+ స్కోరు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా సూర్యవంశీ నిలిచాడు. గతంలో నేపాల్ ఆటగాడు కుశల్ మల్లా 15 ఏళ్ల 340 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా, ఇప్పుడు సూర్యవంశీ ఆ రికార్డును కూడా అధిగమించి భారత క్రికెట్లో ఓ సరికొత్త అధ్యాయానికి నాంది పలికాడు.