YSRCP: హైద‌రాబాద్‌ను కోల్పోయి అనాథ‌ల‌మ‌య్యాం... మ‌ళ్లీ ఆ త‌ర‌హా ప‌రిస్థితి వ‌ద్దు: కొడాలి నాని

  • వేమ‌వ‌రం కొండాల‌మ్మ అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేసిన నాని
  • అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని దేవుళ్లు కూడా హ‌ర్షించ‌రని వ్యాఖ్య‌
  • రాయ‌ల‌సీమ, ఉత్త‌రాంధ్ర‌ల కోస‌మే 3 రాజ‌ధానుల నిర్ణ‌య‌మ‌ని వెల్ల‌డి
kodali nani comments on 3 capitals and amaravati farmers agitation

వైసీపీ ప్ర‌భుత్వం తీసుకున్న 3 రాజ‌ధానుల నిర్ణయంపై ఆ పార్టీకి చెందిన కీల‌క నేత‌, మాజీ మంత్రి కొడాలి నాని బుధ‌వారం మ‌రోమారు స్పందించారు. ద‌స‌రా ప‌ర్వ‌దినాన కృష్ణా జిల్లా గుడ్ల‌వ‌ల్లేరు మండ‌లం వేమ‌వరంలోని కొండాల‌మ్మ అమ్మ వారి ఆల‌యంలో ఆయ‌న ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా త‌మ ప్ర‌భుత్వం తీసుకున్న 3 రాజ‌ధానుల నిర్ణ‌యానికి అమ్మ‌వారి ఆశీస్సులు ఇవ్వాలంటూ మొక్కుకున్నాన‌ని ఆయ‌న తెలిపారు.

రెక్కాడితే గానీ డొక్కాడ‌ని ప‌రిస్థితుల్లో ఉన్న రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల కోస‌మే 3 రాజ‌ధానుల నిర్ణ‌యం తీసుకున్నామ‌ని నాని తెలిపారు. అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని ప్ర‌జ‌ల‌తో పాటు దేవుళ్లు కూడా హ‌ర్షించ‌ర‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కులాలు, పార్టీల కోస‌మో కాకుండా... రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌కు ద్రోహం చేయ‌రాద‌న్న భావ‌న‌తోనే సీఎం జ‌గ‌న్ 3 రాజ‌ధానుల నిర్ణ‌యం తీసుకున్నార‌న్నారు. రాష్ట్ర సంప‌ద అంతా ఒకే చోట పెడితే ప్రాంతీయ విద్వేషాలు వ‌స్తాయ‌ని ఆయ‌న అన్నారు. హైద‌రాబాద్‌ను కోల్పోయి అనాథ‌ల‌మ‌య్యామ‌న్న నాని... శ్ర‌మ అంతా అమ‌రావ‌తిపైనే పెడితే మ‌ళ్లీ అదే ప‌రిస్థితి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అన్నారు.

More Telugu News