Kesineni Swetha: పెళ్లి పీట‌లెక్కనున్న టీడీపీ యువ నేత కేశినేని శ్వేత‌!.. వ‌రుడు ఎవరో తెలుసా?

  • విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా శ్వేత‌
  • కార్పొరేట‌ర్‌గా గెలిచినా టీడీపీ ఓడిపోవ‌డంతో ద‌క్క‌ని ప‌ద‌వి
  • కాజా ర‌ఘుతో శ్వేత‌ వివాహం ఖ‌రారు
  • ఉమ్మ‌డి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రామ‌నాథం మ‌న‌వ‌డే ర‌ఘు
kesineni swetha will marry kaja raghu soon

ఏపీలో విప‌క్ష పార్టీ టీడీపీలో అతి కొద్దికాలంలోనే మంచి గుర్తింపు ద‌క్కించుకున్న యువ మ‌హిళా నేత‌, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత త్వర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారు. అమెరికాలో విద్యాభ్యాసం త‌ర్వాత విజ‌య‌వాడ వ‌చ్చిన శ్వేత‌... 2019 ఎన్నిక‌ల్లో త‌న తండ్రి నాని గెలుపు కోసం తీవ్రంగా శ్ర‌మించారు. అంతేకాకుండా విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో టీడీపీ మేయ‌ర్ అభ్య‌ర్థిగా కూడా ఆమె బ‌రిలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. కార్పొరేట‌ర్‌గా ఆమె గెలిచినా... టీడీపీ ఓట‌మి పాలు కావ‌డంతో ఆమె మేయ‌ర్ ప‌ద‌విని అందుకోలేక‌పోయారు.

తాజాగా కేశినేని శ్వేత వివాహం ఖ‌రారైంది. కృష్ణా జిల్లా ముదినేప‌ల్లికి చెందిన కాజా ర‌ఘుతో ఆమె వివాహం నిశ్చ‌య‌మైంది. శ్వేత ఫ్యామిలీ మాదిరే ర‌ఘు ఫ్యామిలీ కూడా రాజకీయ నేప‌థ్యం క‌లిగిన‌దే. ముదినేపల్లి నియోజకవర్గం నుండి ఓ ద‌ఫా స్వతంత్ర అభ్యర్థిగా, మ‌రోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గెల‌వ‌డంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ గా పనిచేసిన కాజా రామనాధం మ‌న‌వ‌డే ర‌ఘు. ఈ మేర‌కు శ్వేత‌, ర‌ఘుల వివాహ నిశ్చ‌యానికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో చేరిపోగా... త్వ‌ర‌లోనే ఒక్క‌టి కానున్న శ్వేత‌, ర‌ఘుల‌కు అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News