Chandrababu: బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద స్వల్పంగా గాయపడ్డ చంద్రబాబు

  • కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు
  • బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకుని కుప్పంకు రోడ్డు మార్గంలో వెళ్లిన బాబు
  • బాబుతో కరచాలనం చేసేందుకు యత్నించిన టీడీపీ మద్దతుదారులు
TDP chief Chandrababu injured during his Kuppam tour

తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఉదయం స్వల్పంగా గాయపడ్డారు. కుప్పంకు వెళ్లే క్రమంలో ఈ ఉదయం ఆయన బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన కుప్పంకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబుకు పెద్ద సంఖ్యలో టీడీపీ మద్దతుదారులు స్వాగతం పలికారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు వారు యత్నించారు.

ఈ క్రమంలో చంద్రబాబు చేతికి అనుకోకుండా స్వల్ప గాయమయింది. ఆ తర్వాత చంద్రబాబు అక్కడి నుంచి కుప్పంకు బయల్దేరి వెళ్లారు. రేపటి వరకు చంద్రబాబు కుప్పం పర్యటన కొనసాగనుంది. ప్రస్తుతం ఆయన కుప్పం బస్టాండ్ సెంటర్ వద్ద ప్రసంగిస్తున్నారు.

More Telugu News