Chandrababu: చంద్రబాబు కారు మీద బాంబు వేస్తా: వైసీపీ నేత సెంథిల్

  • టీడీపీ, వైసీపీ నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు
  • దమ్ముంటే కుప్పంకు రావాలంటూ చంద్రబాబుకు సెంథిల్ సవాల్
  • ఎంపీ రెడ్డెప్ప సమక్షంలో తీవ్ర వ్యాఖ్యలు
Will through bomb on Chandrababu car says YSRCP leader Senthil Kumar

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీల నాయకులు ఏమాత్రం తగ్గకుండా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. తాజాగా చిత్తూరు జల్లాకు చెందిన ఓ వైసీపీ నేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

'చంద్రబాబూ దమ్ముంటే కుప్పంకు రా. నీ కారు మీద బాంబు వేస్తా' అని అన్నారు. రెస్కో ఛైర్మన్ జీఎస్ సెంథిల్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు ఎంపీ రెడ్డెప్ప సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సెంథిల్ మాట్లాడుతున్నంత సేపు ఎంపీ సహా ఎవరూ మాట్లాడలేదు. అక్కడున్న వారంతా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు.

More Telugu News