కరోనా కొత్త వైరస్ ప్రభావం.. మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ విధింపు!

Maharashtra Curfew From 11 PM To 6 AM Till January 5 Amid Covid
  • యూకేలో విస్తరిస్తున్న కరోనా కొత్త వైరస్
  • ముంబైతో పాటు రాష్ట్రంలోని మేజర్ సిటీస్ లో రాత్రి కర్ఫ్యూ
  • జనవరి 5 వరకు కర్ఫ్యూ అమలు
బ్రిటన్ ను వణికిస్తున్న కరోనా కొత్త వైరస్ ప్రభావం భారత్ పై పడింది. ముంబైతో పాటు రాష్ట్రంలోని అన్ని మేజర్ సిటీస్ లో రాత్రి కర్ఫ్యూని మహారాష్ట్ర ప్రభుత్వం విధించింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని తెలిపింది. జనవరి 5 వరకు ఈ కర్ఫ్యూని అమలు చేస్తున్నట్టు ప్రకటించింది.

మన దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 18,96,518 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్టాల కంటే ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. మరోవైపు కొత్త వైరస్ నేపథ్యంలో యూకే నుంచి రాకపోకలను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Maharashtra
Night Curfew
Corona Virus

More Telugu News