కరోనా కొత్త వైరస్ ప్రభావం.. మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ విధింపు!
- యూకేలో విస్తరిస్తున్న కరోనా కొత్త వైరస్
- ముంబైతో పాటు రాష్ట్రంలోని మేజర్ సిటీస్ లో రాత్రి కర్ఫ్యూ
- జనవరి 5 వరకు కర్ఫ్యూ అమలు
మన దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 18,96,518 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్టాల కంటే ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. మరోవైపు కొత్త వైరస్ నేపథ్యంలో యూకే నుంచి రాకపోకలను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే.