Varla Ramaiah: ముఖ్యమంత్రి గారూ.. మీ మౌనం అంగీకారంగా తీసుకోవచ్చా?: వర్ల రామయ్య

varla slams jagan
  • అమరావతి దళిత రైతులకు బేడీలు
  • మీ పేషి నుండి ఫోన్ వచ్చిన తర్వాతే పోలీసుల చర్య
  • మీరు గాని, మీ పేషి గాని స్పందించలేదు
  • అమాయకులైన సిబ్బందిని సస్పెండ్ చేస్తే ఎలా?
అమరావతి దళిత రైతులకు బేడీలు వేయడం పట్ల టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య ట్వీట్ చేస్తూ మండిపడ్డారు. ఈ ఘటనపై జగన్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.

‘ముఖ్యమంత్రి గారూ.. అమరావతి దళిత రైతులకు మీ పేషి నుండి ఫోన్ వచ్చిన తర్వాతే పోలీసులు బేడీలు వేశారని అందరూ అనుకుంటున్నారు. దీనిపై, మీరు గాని, మీ పేషి గాని స్పందించలేదు. మీ మౌనం, అంగీకారంగా తీసుకోవచ్చా? అమాయకులైన సిబ్బందిని సస్పెండ్ చేస్తే ఎలా? ఆదేశించిన పెద్దలపై చర్యలు తీసుకోండి’ అని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
Varla Ramaiah
Telugudesam
YSRCP

More Telugu News