Crime News: కన్నకూతుర్ని పెన్సిలుతో పొడిచి హింసించిన తల్లి.. హెల్ప్ లైన్‌ నంబరుకు మరో కూతురు ఫిర్యాదు!

  • కొరికి గాయాలపాలు చేసిన వైనం
  • ఆన్‌లైన్ క్లాసుల్లో ఆన్సర్లు చెప్పట్లేదని కర్కశత్వం
  • ఇంటికి చేరుకున్న ఎన్జీవో ప్రతినిధులు
  • ముంబై, శాంతాక్రజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన
mother beats daughter

కన్నకూతురిని పెన్సిలుతో 12 సార్లు పొడిచింది ఓ తల్లి, అనంతరం కొరికి గాయాలపాలు చేసింది. దీంతో ఆమె చిన్నకూతురు భయపడిపోయి, ఆ వెంటనే తెలివిగా హెల్ప్ లైన్‌ నంబరుకు ఫోన్ చేసింది. దీంతో  ఎన్జీవో ప్రతినిధులు వారి ఇంటికి చేరుకుని ఆ తల్లికి చివాట్లు పెట్టి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని శాంతాక్రజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కరోనా నేపథ్యంలో విద్యాలయాలు ఆన్‌లైన్‌ కాస్లులు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరో తరగతి చదువుతున్న ఓ బాలిక ఇంట్లో వర్చువల్ పద్ధతిలో క్లాసులు వింటోంది. ఆ సమయంలో టీచర్ ఆ బాలికను కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆ బాలిక సమాధానం చెప్పకపోవడంతో ఆమె పక్కనే ఉన్న తల్లికి కోపం వచ్చి ఇలా కర్కశంగా ప్రవర్తించింది. టీచర్‌ ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పలేదంటూ కన్న కూతురిని దారుణంగా గాయపర్చింది.

More Telugu News