Sushant Singh Rajput: 'ధోనీ' హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య

  • ముంబయిలోని తన నివాసంలో బలవన్మరణం
  • సుశాంత్ వయసు 34 సంవత్సరాలు
  • ధోనీ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న రాజ్ పుత్
Sushant Singh Rajput commits suicide

'ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్' చిత్రం ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబయిలోని తన నివాసంలో బలవన్మరణం చెందినట్టు గుర్తించారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వయసు 34 సంవత్సరాలు. 'కై పో చే' అనే చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ చివరి చిత్రం 'డ్రైవ్'. దిల్ బేచారా అనే చిత్రం విడుదల కావాల్సి ఉంది.  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాక్ డౌన్ నేపథ్యంలో బాంద్రాలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నాడు. కొన్నిరోజులుగా అతని పరిస్థితి ఏమీ బాగాలేదని, ఉరేసుకుని చనిపోయినట్టు భావిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియా కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటనపై దర్యాప్తులో భాగంగా పోలీసులు సుశాంత్ ను కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దాంతో సుశాంత్ కొంత మానసిక వేదనకు గురయ్యాడని సమాచారం. 

More Telugu News