Chandrababu: డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: చంద్రబాబు

  • డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ
  • కేసు సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో తీర్పు
  • సీబీఐ దర్యాప్తుతో ప్రభుత్వ కుట్ర బయటపడడం ఖాయమన్న చంద్రబాబు
TDP Chief Chandrababu welcomes High Court decision on Dr Sudhakar issue

విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసుల వ్యవహారశైలిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని ట్వీట్ చేశారు. ఎన్-95 మాస్కు అడిగినందుకు ఓ డాక్టర్ పై తప్పుడు ప్రచారం చేస్తూ, నిర్బంధించడమే కాకుండా, పోలీసులతో హింసకు పాల్పడ్డారని, దీని వెనకున్న ప్రభుత్వ కుట్ర సీబీఐ దర్యాప్తుతో వెల్లడవుతుందని తాము గట్టిగా నమ్ముతున్నట్టు తెలిపారు.

More Telugu News