Allu Arjun: 'పుష్ప'క్ నారాయణ్ జోడీగా ఒకే హీరోయిన్!

  • సుకుమార్ నుంచి 'పుష్ప'
  • లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్
  • త్వరలో రెగ్యులర్ షూటింగ్  
Pushpa Movie

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా 'పుష్ప' రూపొందుతోంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక నటించనుంది. ఈ సినిమాలో మరో కథానాయికకు అవకాశం ఉందనీ, ఆ పాత్రకిగాను పూజ హెగ్డేనుగానీ .. నివేదా థామస్ ను గాని తీసుకునే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ సభ్యులు స్పందిస్తూ , ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మాత్రమే కనిపిస్తుందని చెప్పారు. కథాపరంగా మరో నాయికకి అవకాశం లేదని స్పష్టం చేశారు. దాంతో ఇప్పటివరకూ జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్టు అయింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో, లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్ కనిపించనున్న సంగతి తెలిసిందే.

More Telugu News