కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకండీ అవార్డులు?: మెగా ఫ్యామిలీపై కత్తి మహేష్ కామెంట్

  • మెగా ఫ్యామిలీకి నంది అవార్డులపై కత్తి మహేష్ స్పందన 
  • కాపు సామ్రాజ్యాన్ని పవన్ తెస్తారు
  • అప్పుడు పప్పులు, బెల్లాలు పంచుకోండి
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సినీ అవార్డులపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు వ్యక్తులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందంటూ గీతా ఆర్ట్స్ లో కీలక వ్యక్తి అయిన బన్నీ వాసు వ్యాఖ్యానించగా... ఇవి నంది అవార్డులు కావు, సైకిల్ అవార్డులంటూ సినీ నిర్మాత బండ్ల గణేష్ వ్యాఖ్యానించాడు. మరోవైపు, ఈ అంశంపై సినీ క్రిటిక్ మహేష్ కత్తి కూడా ఫేస్ బుక్ ద్వారా స్పందించాడు.

కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకండీ అవార్డులు అంటూ మహేష్ అన్నాడు. 'మీ కాపు సామ్రాజ్యాన్ని పవన్ కల్యాణ్ తెచ్చేదాకా ఆగలేరా' అంటూ సెటైర్ వేశాడు. పవన్ సామ్యాజ్యం వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీకి పప్పులు, బెల్లాలు పంచుకోండి అంటూ కామెంట్ చేశాడు.
Go Back to Shorts
kathi mahesh
Pawan Kalyan
tollywood
nandi awards

More Telugu News