శ్రీశైలం జలాశయానికి తగ్గిపోయిన వరద!
- ఎగువన వర్షాలు లేక తగ్గిన ప్రవాహం
- 69 వేల క్యూసెక్కులకు పడిపోయిన వరద
- ప్రస్తుత నీటి మట్టం 861 అడుగులు
- మరో 20 అడుగులకు పైగా పెరిగితేనే గేట్లు తెరిచే అవకాశం
కాగా, శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 861 అడుగుల నీరు ఉంది. నీటి నిల్వ 110 టీఎంసీలకు పెరగగా, పోతిరెడ్డి పాడు, హంద్రీనీవా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తున్నామని, విద్యుత్ ఉత్పత్తి ద్వారా సాగర్ కు 15 వేల క్యూసెక్కుల నీరు వెళుతోందని అధికారులు తెలిపారు. ఈ ఉదయం ఆల్మట్టికి వస్తున్న ఇన్ ఫ్లో 25 వేల క్యూసెక్కులుగా ఉండగా, నారాయణపూర్ వద్దా అంతే మొత్తం ప్రవాహం నమోదైంది. తుంగభద్రకు 4,511 క్యూసెక్కుల నీరు వస్తోంది. నాగార్జున సాగర్ కు 15,300 క్యూసెక్కుల నీరు వస్తోంది. గడచిన వారం రోజుల వ్యవధిలో నాగార్జున సాగర్ లో 8 టీఎంసీల నీరు చేరింది.