చైనా చిప్ మేకర్ బంపర్ లిస్టింగ్... తొలిరోజే ఇన్వెస్టర్లకు 500 శాతానికి పైగా లాభాలు!
- షాంఘై మార్కెట్లో చైనా చిప్ మేకర్ సీఎక్స్ఎంటీ సంచలనం
- తొలిరోజు ట్రేడింగ్లోనే భారీగా పెరిగిన షేర్ల విలువ
- చైనాలోనే అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా ఆవిర్భావం
చైనాకు చెందిన మెమొరీ చిప్ తయారీ దిగ్గజం సీఎక్స్ఎంటీ కార్ప్ స్టాక్ మార్కెట్లో నూతన చరిత్ర సృష్టించింది. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్లో సోమవారం ట్రేడింగ్ ప్రారంభిమైన తొలిరోజే ఈ కంపెనీ షేర్లు 500 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసి ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేశాయి. ఈ అనూహ్యమైన పెరుగుదలతో, చైనాలోనే అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా సీఎక్స్ఎంటీ అవతరించింది.
ఈ ఐపీఓలో ఒక్కో షేరు ధరను 8.66 యువాన్లుగా నిర్ణయించగా, మార్కెట్లో 49.50 యువాన్ల వద్ద లిస్ట్ అయింది. ట్రేడింగ్ సమయంలో ఒక దశలో షేరు విలువ ఏకంగా 55 యువాన్ల స్థాయికి చేరుకుంది. ఈ భారీ ర్యాలీ ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ సుమారు 3.56 ట్రిలియన్ యువాన్లకు పెరిగింది. తద్వారా, ఇప్పటివరకు దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా ఉన్న ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ)ను సీఎక్స్ఎంటీ అధిగమించింది.
ఈ ఏడాది ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిన సీఎక్స్ఎంటీ, పబ్లిక్ ఇష్యూ ద్వారా 57.9 బిలియన్ యువాన్లను సమీకరించింది. డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ (డీఆర్ఏఎం) చిప్ల తయారీలో చైనాలోనే అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ, అంతర్జాతీయంగా నాలుగో అతిపెద్ద తయారీదారుగా గుర్తింపు పొందింది. ఈ చిప్లను ప్రధానంగా స్మార్ట్ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్లు, సర్వర్లు, ఏఐ డేటా సెంటర్లలో విస్తృతంగా వినియోగిస్తారు.
అమెరికా విధిస్తున్న టెక్నాలజీ ఆంక్షల నడుమ, సెమీకండక్టర్ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న చైనా ఆకాంక్షలకు ఈ ఐపీఓ నిధులు వెన్నుముకగా నిలవనున్నాయి. సేకరించిన నిధులను ఉత్పత్తి సామర్థ్యం పెంపుతో పాటు పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలకు వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ ఐపీఓలో ఒక్కో షేరు ధరను 8.66 యువాన్లుగా నిర్ణయించగా, మార్కెట్లో 49.50 యువాన్ల వద్ద లిస్ట్ అయింది. ట్రేడింగ్ సమయంలో ఒక దశలో షేరు విలువ ఏకంగా 55 యువాన్ల స్థాయికి చేరుకుంది. ఈ భారీ ర్యాలీ ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ సుమారు 3.56 ట్రిలియన్ యువాన్లకు పెరిగింది. తద్వారా, ఇప్పటివరకు దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా ఉన్న ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ)ను సీఎక్స్ఎంటీ అధిగమించింది.
ఈ ఏడాది ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిన సీఎక్స్ఎంటీ, పబ్లిక్ ఇష్యూ ద్వారా 57.9 బిలియన్ యువాన్లను సమీకరించింది. డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ (డీఆర్ఏఎం) చిప్ల తయారీలో చైనాలోనే అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ, అంతర్జాతీయంగా నాలుగో అతిపెద్ద తయారీదారుగా గుర్తింపు పొందింది. ఈ చిప్లను ప్రధానంగా స్మార్ట్ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్లు, సర్వర్లు, ఏఐ డేటా సెంటర్లలో విస్తృతంగా వినియోగిస్తారు.
అమెరికా విధిస్తున్న టెక్నాలజీ ఆంక్షల నడుమ, సెమీకండక్టర్ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న చైనా ఆకాంక్షలకు ఈ ఐపీఓ నిధులు వెన్నుముకగా నిలవనున్నాయి. సేకరించిన నిధులను ఉత్పత్తి సామర్థ్యం పెంపుతో పాటు పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలకు వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.