ఏపీ పోలీసులు ఎఫ్బీఐగా నటిస్తున్నారు.. ఈ ఆదేశాలు ఎవరిచ్చారు?: జగన్
- చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు
- ఎఫ్బీఐగా నటిస్తూ ఏపీ పోలీసులు సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని కోరారని వెల్లడి
- ఇది ప్రభుత్వ ప్రాయోజిత మోసమంటూ జగన్ విమర్శ
- ఈ చర్యతో ఏపీ పరువు తీశారంటూ మండిపడ్డ మాజీ సీఎం
- హామీల అమలుపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి హితవు
ఆంధ్రప్రదేశ్ పోలీసులు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అధికారులమంటూ నటిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా పోస్టులను తొలగించేందుకు రాష్ట్ర పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణమని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో జరుగుతున్న ప్రభుత్వ స్పాన్సర్డ్ మోసమని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ మేరకు బుధవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. "చంద్రబాబు గారి రెడ్ బుక్ పాలన ఇప్పుడు ప్రపంచస్థాయికి చేరింది. ఇప్పుడు ఏపీ పోలీసులు ఎఫ్బీఐగా నటిస్తున్నారు! ఇది నకిలీ గుర్తింపు, కానీ ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
"చంద్రబాబు గారూ, ఇది పోలీసింగా? లేక రాజకీయ వేధింపుల కోసం చేస్తున్న ప్రభుత్వ ప్రాయోజిత మోసమా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పోస్టులను తొలగించేందుకు ఏపీ పోలీసులే తమ అధికారిక ఈమెయిల్ నుంచి ‘ఎక్స్’కు అభ్యర్థన పంపారని, కానీ అభ్యర్థన పంపిన సంస్థ పేరుగా ‘ఎఫ్బీఐ’ని పేర్కొన్నారని ‘ఎక్స్’ సంస్థే ధ్రువీకరించింది. ఈ ఆదేశాలు ఎవరు ఇచ్చారు? ఎఫ్బీఐ పేరును ఎందుకు దుర్వినియోగం చేశారు?" అంటూ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు.
సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల వైఫల్యం, డీఎస్సీ స్కామ్, అమరావతి దోపిడీ, రాష్ట్ర అప్పులు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడానికే ఈ కుట్ర చేశారా? అని ఆయన నిలదీశారు. పోలీసు యూనిఫాం చట్టాన్ని రక్షించడానికి ఉద్దేశించిందని, రాజకీయ సెన్సార్షిప్ కోసం కాదని హితవు పలికారు. ఈ చర్య ద్వారా విదేశీ దర్యాప్తు సంస్థ పేరును రాజకీయాల్లోకి లాగి ఆంధ్రప్రదేశ్ పరువును తీశారని, పోలీసు వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు.
విమర్శకుల గొంతు నొక్కేందుకు వెచ్చిస్తున్న శక్తిని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల అమలుపై పెట్టాలని జగన్ సూచించారు. కరవుతో ఇబ్బంది పడుతున్న రైతులకు అండగా నిలవడం, ఉద్యోగాలు సృష్టించడం, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టడం వంటి పనులు చేయాలన్నారు. ప్రభుత్వం తన పనితీరుపై నమ్మకంతో ఉంటే, విమర్శలకు సెన్సార్షిప్తో కాకుండా పనితీరు, పారదర్శకతతో సమాధానం చెప్పాలని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
ఈ మేరకు బుధవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. "చంద్రబాబు గారి రెడ్ బుక్ పాలన ఇప్పుడు ప్రపంచస్థాయికి చేరింది. ఇప్పుడు ఏపీ పోలీసులు ఎఫ్బీఐగా నటిస్తున్నారు! ఇది నకిలీ గుర్తింపు, కానీ ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
"చంద్రబాబు గారూ, ఇది పోలీసింగా? లేక రాజకీయ వేధింపుల కోసం చేస్తున్న ప్రభుత్వ ప్రాయోజిత మోసమా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పోస్టులను తొలగించేందుకు ఏపీ పోలీసులే తమ అధికారిక ఈమెయిల్ నుంచి ‘ఎక్స్’కు అభ్యర్థన పంపారని, కానీ అభ్యర్థన పంపిన సంస్థ పేరుగా ‘ఎఫ్బీఐ’ని పేర్కొన్నారని ‘ఎక్స్’ సంస్థే ధ్రువీకరించింది. ఈ ఆదేశాలు ఎవరు ఇచ్చారు? ఎఫ్బీఐ పేరును ఎందుకు దుర్వినియోగం చేశారు?" అంటూ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు.
సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల వైఫల్యం, డీఎస్సీ స్కామ్, అమరావతి దోపిడీ, రాష్ట్ర అప్పులు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడానికే ఈ కుట్ర చేశారా? అని ఆయన నిలదీశారు. పోలీసు యూనిఫాం చట్టాన్ని రక్షించడానికి ఉద్దేశించిందని, రాజకీయ సెన్సార్షిప్ కోసం కాదని హితవు పలికారు. ఈ చర్య ద్వారా విదేశీ దర్యాప్తు సంస్థ పేరును రాజకీయాల్లోకి లాగి ఆంధ్రప్రదేశ్ పరువును తీశారని, పోలీసు వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు.
విమర్శకుల గొంతు నొక్కేందుకు వెచ్చిస్తున్న శక్తిని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల అమలుపై పెట్టాలని జగన్ సూచించారు. కరవుతో ఇబ్బంది పడుతున్న రైతులకు అండగా నిలవడం, ఉద్యోగాలు సృష్టించడం, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టడం వంటి పనులు చేయాలన్నారు. ప్రభుత్వం తన పనితీరుపై నమ్మకంతో ఉంటే, విమర్శలకు సెన్సార్షిప్తో కాకుండా పనితీరు, పారదర్శకతతో సమాధానం చెప్పాలని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.