రూ.1,470 కోట్ల లాటరీ.. సగం డబ్బు దానం చేసిన మహిళ!

రూ.1,470 కోట్ల లాటరీ.. సగం డబ్బు దానం చేసిన మహిళ!

Frances Connolly donates half of 1470 crore lottery prize money
  • రూ.1,470 కోట్ల లాటరీ గెలిచిన ఫ్రాన్సెస్‌
  • ఇప్పటి వరకు దాదాపు రూ.632 కోట్లు దానం
  • సేవ కోసం ప్రత్యేక ట్రస్ట్‌ ఏర్పాటు
  • డాలీ పార్టన్‌ తనకు స్ఫూర్తి అన్న ఫ్రాన్సెస్‌
  • భారీ సంపద వచ్చినా సాధారణంగానే జీవనం
ఒక్కసారిగా రూ.1,470 కోట్ల లాటరీ తగిలితే ఏం చేస్తారు? విలాసవంతమైన జీవితం గడపాలని చాలామంది అనుకుంటారు. కానీ బ్రిటన్‌కు చెందిన ఫ్రాన్సెస్‌ కొన్నోలీ మాత్రం తన సంపదలో దాదాపు సగాన్ని ఇతరుల కోసం ఖర్చు చేశారు. 2019లో భర్త ప్యాడీతో కలిసి ఆమె 11.5 కోట్ల పౌండ్ల యూరోమిలియన్స్‌ జాక్‌పాట్‌ గెలుచుకున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం ఇది సుమారు రూ.1,470 కోట్లు.

లాటరీ గెలిచిన తర్వాత కుటుంబానికి అవసరమైన భద్రత కల్పించారు. పిల్లలు హాయిగా జీవించేందుకు సరిపడా డబ్బు ఉంచుకున్నారు. మిగిలిన సంపదలో పెద్ద మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు మళ్లించారు. ఇప్పటివరకు దాదాపు రూ.632.5 కోట్లను దానం చేసినట్లు సమాచారం.

ఇందుకోసం ఫ్రాన్సెస్‌ ప్రత్యేకంగా ఓ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ను కూడా ఏర్పాటు చేశారు. స్థానిక సమాజాలకు, అవసరంలో ఉన్నవారికి సాయం చేస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో తనకు ప్రముఖ గాయని డాలీ పార్టన్‌ స్ఫూర్తి అని ఆమె చెబుతున్నారు.

భారీ సంపద వచ్చినా ఫ్రాన్సెస్‌, ప్యాడీ తమ జీవనశైలిని పెద్దగా మార్చుకోలేదు. ఉత్తర తూర్పు ఇంగ్లాండ్‌లోనే సాధారణ జీవితం కొనసాగిస్తున్నారు. సెలవులకు వెళ్తారు. విశాలమైన ఇంట్లో ఉంటారు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసినా డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయరు. వాడిన లగ్జరీ వాచీలు, కార్లను కూడా కొనుగోలు చేస్తుంటారు.

‘కుటుంబం హాయిగా ఉండేందుకు సరిపడా డబ్బు ఉన్నప్పుడు మిగతాదంతా దాచుకోవడం ఎందుకు?’ అన్నది ఫ్రాన్సెస్‌ ఆలోచన. తన వయసు దృష్ట్యా కూడా సంపదను పంచుకోవడమే సరైన నిర్ణయంగా భావించినట్లు ఆమె తెలిపారు.
Advertisement
Frances Connolly
EuroMillions jackpot winner
Lottery money donation
Paddy Connolly
UK lottery winner news
Charitable trust donation

More Telugu News