మంత్రులు, ఎంపీలతో జనసేన కమిటీ.. స్థానిక ఎన్నికలే లక్ష్యం

Janasena committee with Ministers and MPs targeting local body elections
  • స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ప్రత్యేక దృష్టి
  • 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు
  • ఎన్నికల వ్యూహాలు, మార్గదర్శకాల రూపకల్పన బాధ్యత
  • కమిటీలో మంత్రి దుర్గేష్, ఎంపీ బాలశౌరికి చోటు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను జనసేన పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, మార్గదర్శకాలను రూపొందించేందుకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ 14 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు శుక్రవారం అమరావతి నుంచి ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఈ కమిటీలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఎంపీ వల్లభనేని బాలశౌరి వంటి కీలక నేతలకు చోటు కల్పించారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, దేవ వరప్రసాద్, సి.హెచ్. వంశీకృష్ణ యాదవ్, లోకం మాధవి, పాట్సమట్ల ధర్మరాజు సభ్యులుగా నియమితులయ్యారు.

వీరితో పాటు ఎంఎస్ఎంసీ చైర్మన్ టి. శివశంకర్, చిలకం మధుసూదన్ రెడ్డి, కోటికలపూడి గోవిందరావు, సామినేని ఉదయభాను, యనమల భాస్కర్, కోరికాన రవికుమార్‌లను కమిటీలో సభ్యులుగా నియమించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాల ఖరారు వంటి కీలక బాధ్యతలను ఈ కమిటీ పర్యవేక్షించనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Advertisement
Pawan Kalyan
Janasena Party
Andhra Pradesh Local Body Elections
Kandula Durgesh
Vallabhaneni Balashowry
Janasena Election Committee

More Telugu News