కుమార్తె తొలి జీతంతో 'మార్గదర్శి'లో రూ.25 లక్షల చిట్ వేయించిన టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
- కుమార్తె పేరుతో మార్గదర్శిలో భారీ చిట్ వేయించిన టీడీపీ ఎంపీ
- సత్యం నిప్పు లాంటిది: మార్గదర్శిలో చిట్ వేసిన ఎంపీ కలిశెట్టి
- మార్గదర్శి కార్యాలయంలో స్వీట్లు పంచి ఎంపీ సందడి
విజయనగరం ఎంపీ, టీడీపీ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు మార్గదర్శి సంస్థపై తనకున్న అచంచల విశ్వాసాన్ని, మద్దతును చాటుకున్నారు. శుక్రవారం ఆయన మార్గదర్శి కార్యాలయాన్ని సందర్శించి, తన కుమార్తె నిఖిల తొలి నెల వేతనంతో ఆమె పేరిట రూ. 25 లక్షల విలువైన చిట్ వేయించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు.
ఇటీవల మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మార్గదర్శి కార్యాలయానికి విచ్చేసిన ఎంపీ కలిశెట్టి మాట్లాడుతూ, "సత్యం నిప్పు లాంటిది, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది" అని వ్యాఖ్యానించారు. నిజాయతీ, నిబద్ధత, పారదర్శకత, విశ్వసనీయత వంటి విలువల కారణంగానే ప్రజలు మార్గదర్శిపై అపారమైన నమ్మకం ఉంచుతున్నారని ఆయన కొనియాడారు.
తాను సుమారు 20 ఏళ్ల క్రితమే మార్గదర్శి సంస్థకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో అంతిమంగా న్యాయమే గెలిచిందని, ఈ పరిణామంతో మార్గదర్శిపై ప్రజల్లో ఉన్న నమ్మకం మరింత బలపడిందని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మార్గదర్శి కార్యాలయానికి విచ్చేసిన ఎంపీ కలిశెట్టి మాట్లాడుతూ, "సత్యం నిప్పు లాంటిది, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది" అని వ్యాఖ్యానించారు. నిజాయతీ, నిబద్ధత, పారదర్శకత, విశ్వసనీయత వంటి విలువల కారణంగానే ప్రజలు మార్గదర్శిపై అపారమైన నమ్మకం ఉంచుతున్నారని ఆయన కొనియాడారు.
తాను సుమారు 20 ఏళ్ల క్రితమే మార్గదర్శి సంస్థకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో అంతిమంగా న్యాయమే గెలిచిందని, ఈ పరిణామంతో మార్గదర్శిపై ప్రజల్లో ఉన్న నమ్మకం మరింత బలపడిందని ఆయన పేర్కొన్నారు.