సీడ్ యాక్సెస్ రోడ్డు.. నూతన స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన చంద్రబాబు

Chandrababu Naidu inaugurates Seed Access Road and new steel bridge
  • అమరావతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం
  • 21.77 కిలోమీటర్ల పొడవైన సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
  • బకింగ్‌హామ్ కెనాల్‌పై 4 వరుసల స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అమరావతి రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్ రెండో దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాజధాని కనెక్టివిటీని బలోపేతం చేసే లక్ష్యంతో మొత్తం రూ.1,519 కోట్ల భారీ వ్యయంతో 21.77 కిలోమీటర్ల పొడవున, 60 మీటర్ల వెడల్పుతో 9 లేన్ల రహదారిగా దీనిని రూపొందిస్తున్నారు. 


విజయవాడ-మంగళగిరి హైవేను అనుసంధానిస్తూ బకింగ్‌హామ్ కెనాల్‌పై 478 మీటర్ల పొడవునా నూతనంగా నిర్మించిన 4 వరుసల స్టీల్ బ్రిడ్జిని కూడా సీఎం ప్రారంభించారు. ఇది రాజధాని ప్రాంతానికి రాకపోకలను మరింత సులభతరం చేయనుంది.


సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమీపంలో అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మించిన 9 టవర్లలోని 216 క్వార్టర్ల పనులన్నీ (ఇంటీరియర్స్ సహా) పూర్తయ్యాయి. అధికారులు వీటికి సంబంధించిన తాళాలను సీఎం చంద్రబాబు నాయుడికి అందజేయనున్నారు.

Advertisement
Chandrababu Naidu
Amaravati Seed Access Road
Andhra Pradesh Capital City
Amaravati Steel Bridge
Buckingham Canal Bridge
Amaravati Infrastructure

More Telugu News