కేసీఆర్ బంధువు జోగినపల్లి శ్రీనివాస్ మృతి.. నివాళి అర్పించిన ఎర్ర‌బెల్లి

KCR relative Joginapally Srinivas Rao passes away Errabelli pays tribute
  • యశోద ఆసుపత్రిలో కన్నుమూసిన శ్రీనివాస్ రావు
  • హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న ఎర్రబెల్లి
  • కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎర్రబెల్లి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బావమరిది, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సమీప బంధువైన జోగినపల్లి శ్రీనివాస్ రావు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.


శ్రీనివాస్ రావు మరణవార్త తెలిసిన వెంటనే ఎర్రబెల్లి దయాకర్ రావు హుటాహుటిన యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ శ్రీనివాస్ రావు పార్థివదేహానికి పూలమాల వేసి అశ్రునయనాలతో నివాళులర్పించారు. అనంతరం తీవ్ర శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. శ్రీనివాస్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఈ లోటును తట్టుకునే శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.

Advertisement
Joginapally Srinivas Rao
KCR relative death
Errabelli Dayakar Rao
Yashoda Hospital Secunderabad
BRS leader death news
Joginapally Srinivas Rao passed away

More Telugu News