కన్నబిడ్డను అమ్మి.. కిడ్నాప్ నాటకం ఆడిన తల్లిదండ్రులు
- మహబూబ్నగర్లో 15 రోజుల పసికందు అమ్మకం
- లక్ష రూపాయలకు బిడ్డను అమ్ముకున్న తల్లిదండ్రులు
- బిడ్డ కిడ్నాప్ అయిందంటూ పోలీసులకు ఫిర్యాదు
- దర్యాప్తులో అసలు నిజం వెల్లడి.. ఇద్దరిపై కేసు
కన్నబిడ్డను లక్ష రూపాయలకు విక్రయించి, ఆపై శిశువు కిడ్నాప్నకు గురైనట్లు నాటకమాడిన అమానవీయ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో కలకలం రేపింది. మహబూబ్నగర్ రూరల్ మండలం, తెలుగుగూడెం ప్రాంతానికి చెందిన కేశవులు, నీలమ్మ దంపతులకు 15 రోజుల క్రితం శిశువు జన్మించింది. అయితే, జూలై 13న తాము బయటకు వెళ్లిన సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బిడ్డను అపహరించుకుపోయారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఐసీడీఎస్ అధికారులకు తల్లిదండ్రుల ప్రవర్తనపై అనుమానం కలగడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బిడ్డ కిడ్నాప్ అవలేదని, తల్లిదండ్రులే స్వయంగా తరుణ్, భీమయ్య అనే ఇద్దరు వ్యక్తులకు లక్ష రూపాయలకు శిశువును విక్రయించినట్లు తేలింది.
దీంతో పోలీసులు తరుణ్, భీమయ్యలపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 137 కింద కేసు నమోదు చేశారు. వారిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిన అనంతరం బిడ్డ తల్లిదండ్రులు కేశవులు, నీలమ్మలపై కూడా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఐసీడీఎస్ అధికారులకు తల్లిదండ్రుల ప్రవర్తనపై అనుమానం కలగడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బిడ్డ కిడ్నాప్ అవలేదని, తల్లిదండ్రులే స్వయంగా తరుణ్, భీమయ్య అనే ఇద్దరు వ్యక్తులకు లక్ష రూపాయలకు శిశువును విక్రయించినట్లు తేలింది.
దీంతో పోలీసులు తరుణ్, భీమయ్యలపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 137 కింద కేసు నమోదు చేశారు. వారిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిన అనంతరం బిడ్డ తల్లిదండ్రులు కేశవులు, నీలమ్మలపై కూడా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.