మధ్యప్రదేశ్లో భారీ దోపిడీ.. రాజకోట నుంచి 3 వేల కిలోల ఫిరంగి అపహరణ
- మధ్యప్రదేశ్లోని నార్వార్ కోట నుంచి ఫిరంగి చోరీ
- క్రేన్, ట్రక్కు సాయంతో ఫిరంగిని ఎత్తుకెళ్లిన ముఠా
- చోరీకి గురైన ఫిరంగి సింధియా కాలం నాటిదని గుర్తింపు
- సెక్యూరిటీ గార్డును తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడిన దుండగులు
మధ్యప్రదేశ్లోని శివ్పురి జిల్లాలో అత్యంత సాహసోపేతమైన రీతిలో భారీ చోరీ చోటుచేసుకుంది. సింధియా రాజవంశం కాలం నాటి చారిత్రక నార్వార్ కోట నుంచి సుమారు 3,000 కిలోల బరువున్న భారీ ఫిరంగిని దుండగులు అపహరించారు. ఈ భారీ దోపిడీ కోసం నిందితులు క్రేన్, ట్రక్కును ఉపయోగించడం స్థానికంగా కలకలం రేపుతోంది. క్రేన్ సహాయంతో ఫిరంగిని ట్రక్కులోకి ఎక్కించి వారు అక్కడి నుంచి పరారయ్యారు.
జూలై 15 అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 25 నుంచి 30 మంది సాయుధులు కోట వెనుక మార్గం ద్వారా లోపలికి ప్రవేశించారు. విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు బాల్కిషన్ను తుపాకీతో బెదిరించి, ప్రతిఘటించవద్దని హెచ్చరించారు. తన వద్ద కేవలం కర్ర మాత్రమే ఉందని, దుండగులు అత్యాధునిక ఆయుధాలతో వచ్చారని, కనీసం టార్చ్లైట్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా అక్కడ లేవని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
కోటలోని కచేరి ప్రాంగణంలో మొత్తం 14 ఫిరంగులు ఉండగా, వాటిలో అత్యంత విలువైన ఒక ఫిరంగిని దుండగులు ఎత్తుకెళ్లారు. 16వ శతాబ్దానికి చెందిన ఈ ఫిరంగికి సింధియా కాలంలో సైనికపరంగా విశేష ప్రాముఖ్యత ఉండేది. దీనిపై ఉన్న అద్భుతమైన కళాకృతులు, గుర్తులు ఆ ఫిరంగికి ఉన్న చారిత్రక విలువను చాటిచెబుతాయి.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కరేరా ఎస్డీపీఓ ప్రశాంత్ శర్మ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ తరుణ్ కుమార్ మహోబియా ఈ చోరీని తీవ్రంగా పరిగణించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు కోటను సందర్శించనున్నట్లు వెల్లడించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ దోపిడీ వెనుక అంతర్జాతీయ పురావస్తు స్మగ్లింగ్ ముఠాల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.
జూలై 15 అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 25 నుంచి 30 మంది సాయుధులు కోట వెనుక మార్గం ద్వారా లోపలికి ప్రవేశించారు. విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు బాల్కిషన్ను తుపాకీతో బెదిరించి, ప్రతిఘటించవద్దని హెచ్చరించారు. తన వద్ద కేవలం కర్ర మాత్రమే ఉందని, దుండగులు అత్యాధునిక ఆయుధాలతో వచ్చారని, కనీసం టార్చ్లైట్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా అక్కడ లేవని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
కోటలోని కచేరి ప్రాంగణంలో మొత్తం 14 ఫిరంగులు ఉండగా, వాటిలో అత్యంత విలువైన ఒక ఫిరంగిని దుండగులు ఎత్తుకెళ్లారు. 16వ శతాబ్దానికి చెందిన ఈ ఫిరంగికి సింధియా కాలంలో సైనికపరంగా విశేష ప్రాముఖ్యత ఉండేది. దీనిపై ఉన్న అద్భుతమైన కళాకృతులు, గుర్తులు ఆ ఫిరంగికి ఉన్న చారిత్రక విలువను చాటిచెబుతాయి.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కరేరా ఎస్డీపీఓ ప్రశాంత్ శర్మ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ తరుణ్ కుమార్ మహోబియా ఈ చోరీని తీవ్రంగా పరిగణించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు కోటను సందర్శించనున్నట్లు వెల్లడించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ దోపిడీ వెనుక అంతర్జాతీయ పురావస్తు స్మగ్లింగ్ ముఠాల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.