ప్రధాని మోదీతో శాంసంగ్ ఛైర్మన్ సెల్ఫీ
- నోయిడాలోని శాంసంగ్ ఫెసిలిటీలో జరిగిన రాష్ట్ర విందులో ఆసక్తికర ఘటన
- భారత పర్యటనలో ఉన్న దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్
- రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన కొరియా అధ్యక్షుడు
- ఇరు దేశాల మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు
దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ భారత్, వియత్నాం దేశాల పర్యటనలో భాగంగా భారీ వ్యాపార ప్రతినిధి బృందంతో కలిసి వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా జరిగిన కొరియా-ఇండియా బిజినెస్ ఫోరంలో హ్యుందాయ్, ఎస్కే గ్రూప్, ఎల్జీ సంస్థల అధినేతలతో సహా సుమారు 250 మంది కొరియా వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.
1996 నుంచి శాంసంగ్ తన నోయిడా ప్లాంట్లో బడ్జెట్ మోడల్స్ నుంచి ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ల వరకు తయారుచేస్తోంది.
తన మూడు రోజుల పర్యటనలో భాగంగా, దక్షిణ కొరియా అధ్యక్షుడు ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. "మహాత్మా గాంధీ శాంతి స్ఫూర్తి ప్రపంచాన్ని శాంతితో నింపాలని ఆశిస్తూ, నేను కూడా అందుకు సంయుక్తంగా కృషి చేస్తాను" అని లీ పేర్కొన్నారు. శాంతి, ప్రజాస్వామ్యం పునాదులపై ఇరు దేశాలు ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని 'ఎక్స్' వేదికగా ఆకాంక్షించారు.