Tedros Adhanom Ghebreyesus: ఇరాన్ యుద్ధానికి ఉత్తమ ఔషధం అదే: డబ్ల్యూహెచ్ఓ చీఫ్
మధ్యప్రాచ్యంలో యుద్ధం అత్యంత ప్రమాదకరమైన దశకు చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్లోని నతాన్జ్ అణు కేంద్రం, ఇజ్రాయెల్లోని దిమోనా అణు సదుపాయం ఉన్న నగరంపై దాడులు జరిగినట్లు వచ్చిన నివేదికలతో పరిస్థితి మరింత తీవ్రంగా మారిందని ఆదివారం ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటనలపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) దర్యాప్తు చేస్తోందని టెడ్రోస్ తెలిపారు. ప్రస్తుతానికి రేడియేషన్ స్థాయుల్లో ఎలాంటి అసాధారణ పెరుగుదల నమోదు కాలేదని నివేదికలు చెబుతున్నా, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెను ముప్పు సృష్టిస్తుందని హెచ్చరించారు. అన్ని పక్షాలు అత్యంత సైనిక సంయమనం పాటించాలని, శాంతే ఉత్తమ ఔషధమని పిలుపునిచ్చారు. యుద్ధం శాంతిని తీసుకురాదని, రాబోయే తరాలకు ద్వేషించడానికి కొత్త కారణాలను మాత్రమే నేర్పుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అణు ప్రమాదాలు సంభవిస్తే స్పందించేందుకు ఇప్పటికే 13 దేశాల్లో తమ సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హర్మూజ్ జలసంధిని 48 గంటల్లోగా పూర్తిగా తెరవకపోతే, ఇరాన్లోని విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. అందులోనూ మొదట అతిపెద్ద ప్లాంట్ను లక్ష్యంగా చేసుకుంటామని తన సోషల్ మీడియా పోస్టులలో స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్ నౌకాదళం, వాయుసేనతో పాటు యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ వ్యవస్థలను నిర్వీర్యం చేశామని, తమ సైనిక లక్ష్యాలకు దగ్గరగా ఉన్నామని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, హర్మూజ్ జలసంధి తెరిచే ఉందని, కానీ శత్రుదేశాలకు మాత్రం ప్రవేశం లేదని ఇరాన్ కౌంటర్ ఇచ్చింది.
ఈ ఘటనలపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) దర్యాప్తు చేస్తోందని టెడ్రోస్ తెలిపారు. ప్రస్తుతానికి రేడియేషన్ స్థాయుల్లో ఎలాంటి అసాధారణ పెరుగుదల నమోదు కాలేదని నివేదికలు చెబుతున్నా, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెను ముప్పు సృష్టిస్తుందని హెచ్చరించారు. అన్ని పక్షాలు అత్యంత సైనిక సంయమనం పాటించాలని, శాంతే ఉత్తమ ఔషధమని పిలుపునిచ్చారు. యుద్ధం శాంతిని తీసుకురాదని, రాబోయే తరాలకు ద్వేషించడానికి కొత్త కారణాలను మాత్రమే నేర్పుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అణు ప్రమాదాలు సంభవిస్తే స్పందించేందుకు ఇప్పటికే 13 దేశాల్లో తమ సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హర్మూజ్ జలసంధిని 48 గంటల్లోగా పూర్తిగా తెరవకపోతే, ఇరాన్లోని విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. అందులోనూ మొదట అతిపెద్ద ప్లాంట్ను లక్ష్యంగా చేసుకుంటామని తన సోషల్ మీడియా పోస్టులలో స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్ నౌకాదళం, వాయుసేనతో పాటు యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ వ్యవస్థలను నిర్వీర్యం చేశామని, తమ సైనిక లక్ష్యాలకు దగ్గరగా ఉన్నామని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, హర్మూజ్ జలసంధి తెరిచే ఉందని, కానీ శత్రుదేశాలకు మాత్రం ప్రవేశం లేదని ఇరాన్ కౌంటర్ ఇచ్చింది.