Visakhapatnam: విశాఖలో భారీ వర్షాలకు ఇళ్లలోకి వస్తున్న పాములు... వీడియో ఇదిగో!
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాములు ఇళ్లలోకి వస్తుండడం భయాందోళన కలిగిస్తోంది. తాజాగా విశాఖపట్నంలోని ఆరిలోవ ప్రాంతంలో ఓ భారీ కొండచిలువ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఆరిలోవ పరిధిలోని క్రాంతినగర్లో సుమారు 12 అడుగుల పొడవున్న కొండచిలువ ఓ ఇంటి ముందున్న కాలువలో కనిపించడంతో కలకలం రేగింది.
వివరాల్లోకి వెళితే, గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఈ కొండచిలువ క్రాంతినగర్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఓ ఇంటి ముందున్న మురుగు కాలువలో పామును గమనించిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భారీ కొండచిలువను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే కొందరు యువకులు ధైర్యం చేసి, దానిని సురక్షితంగా పట్టుకున్నారు.
ఆ తర్వాత కొండచిలువకు ఎలాంటి హానీ తలపెట్టకుండా, దానిని బంధించి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వర్షాకాలంలో పాములు, ఇతర విష కీటకాలు ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే, గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఈ కొండచిలువ క్రాంతినగర్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఓ ఇంటి ముందున్న మురుగు కాలువలో పామును గమనించిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భారీ కొండచిలువను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే కొందరు యువకులు ధైర్యం చేసి, దానిని సురక్షితంగా పట్టుకున్నారు.
ఆ తర్వాత కొండచిలువకు ఎలాంటి హానీ తలపెట్టకుండా, దానిని బంధించి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వర్షాకాలంలో పాములు, ఇతర విష కీటకాలు ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.