Bellamkonda Sreenivas: దిగినవాళ్లకే ఇక్కడ లోతు తెలుస్తుంది: బెల్లంకొండ శ్రీనివాస్

Bellamkonda Sreenivas Reveals Truths About Tollywood Relationships
షార్ట్స్‌లో చూడండి
 టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్ర పరిశ్రమలోని స్నేహాలు, అంతర్గత సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఎవరి స్వార్థం వారిదేనని, మనవాళ్లు అనుకోవడానికి ఎవరూ ఉండరని కుండబద్దలు కొట్టారు. తన తాజా చిత్రం ‘కిష్కింధపురి’ విడుదల సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, "చిత్ర పరిశ్రమ ఓ సముద్రం లాంటిది. దాని లోతు అందులోకి దిగిన వారికే అర్థమవుతుంది. ఇక్కడ స్నేహితులు ఉండొచ్చు, కానీ బయట ప్రపంచంలో ఉన్నంత స్వచ్ఛమైన బంధాలు ఉండవు. మన ముందు ఒకలా మాట్లాడి, మనం పక్కకు వెళ్లగానే మరోలా ప్రవర్తిస్తుంటారు. అందుకే నేను ఎవరి గురించి గాసిప్స్ వినను, మాట్లాడను" అని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత నైజం గురించి వివరిస్తూ, "నేను చాలా ఓపెన్‌గా ఉంటాను. మనసులో ఏదీ దాచుకోను. ఎవరైనా నన్ను బాధపెడితే, ఆ విషయాన్ని వాళ్ల ముఖం మీదే చెప్పేస్తాను. అదేవిధంగా, నేను తప్పు చేస్తే వెంటనే ఒప్పుకుంటాను" అని తెలిపారు.

ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. "మంచి కథతో సినిమా తీస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. మా ‘కిష్కింధపురి’ చిత్రం ఆ నమ్మకాన్ని నిలబెడుతుంది. దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి అద్భుతమైన కథను సిద్ధం చేశారు. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఫోన్ చూసే తీరిక కూడా లేకుండా కథనం ఉత్కంఠగా సాగుతుంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజువల్ ఎఫెక్ట్స్, సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Bellamkonda Sreenivas
Bellamkonda Sai Sreenivas
Kishkindhapuri
Telugu cinema
Tollywood
Kaushik Pegallapati
Movie release
Film industry
Movie review
Telugu movies

More Telugu News