చెన్నైలో ఉన్నప్పటి నుంచి కనకరత్నమ్మ గారు ఎంతో ఆప్యాయత చూపేవారు: పవన్ కల్యాణ్
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి, దివంగత ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య అర్ధాంగి అల్లు కనకరత్నమ్మ తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కనకరత్నమ్మ మృతి పట్ల ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, అల్లు కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. చెన్నైలో ఉన్నప్పటి నుంచి కనకరత్నమ్మ ఎంతో ఆప్యాయత చూపేవారని ఆయన స్మరించుకున్నారు. ఆమె గొప్ప మాతృమూర్తి అని, తమ వదినమ్మ అయిన సురేఖ గారిని ఎంతో ప్రేమాభిమానాలతో తీర్చిదిద్దారని పవన్ కల్యాణ్ కొనియాడారు. చుట్టూ ఉన్నవారి పట్ల ప్రేమగా మెలగడం సురేఖ గారు తల్లి కనకరత్నమ్మ నుంచే నేర్చుకున్నారని ఆయన పేర్కొన్నారు.
కనకరత్నమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ కష్ట సమయంలో అల్లు అరవింద్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, అల్లు కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. చెన్నైలో ఉన్నప్పటి నుంచి కనకరత్నమ్మ ఎంతో ఆప్యాయత చూపేవారని ఆయన స్మరించుకున్నారు. ఆమె గొప్ప మాతృమూర్తి అని, తమ వదినమ్మ అయిన సురేఖ గారిని ఎంతో ప్రేమాభిమానాలతో తీర్చిదిద్దారని పవన్ కల్యాణ్ కొనియాడారు. చుట్టూ ఉన్నవారి పట్ల ప్రేమగా మెలగడం సురేఖ గారు తల్లి కనకరత్నమ్మ నుంచే నేర్చుకున్నారని ఆయన పేర్కొన్నారు.
కనకరత్నమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ కష్ట సమయంలో అల్లు అరవింద్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.