Krishna Raju: ఆ రోజున కృష్ణంరాజు కుప్పకూలిపోయారు: శ్యామలాదేవి

- కృష్ణంరాజుగారి జీవితంలోకి అలా వచ్చాను
- ఆయన నన్ను బాధపెట్టిన సందర్భమే లేదు
- బ్రదర్ పోయినప్పుడు ఆయన కుంగిపోయారు
- ఆయన మనసున్న మనిషన్న శ్యామలాదేవి
కృష్ణంరాజు.. తెలుగు తెర రెబల్ స్టార్. ఆయన డైలాగ్ డెలివరీ.. బాడీ లాంగ్వేజ్ ను అప్పట్లో ఎంతోమంది అభిమానులు ఇష్టపడేవారు. అలాంటి ఆయన గురించి ఆయన శ్రీమతి శ్యామలాదేవి, తాజాగా ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వూలో ప్రస్తావించారు. "కృష్ణంరాజుగారి మొదటి భార్య సీతాదేవిగారు చనిపోవడం వలన, ఆయన జీవితంలోకి నేను అడుగుపెట్టడం జరిగింది. నాకూ ఆయనకి మధ్య 28 ఏళ్ల వ్యత్యాసం ఉంది. అందువల్లనే నాకు ఈ పెళ్లి ఇష్టామేనా? లేదంటే ఇంట్లో వాళ్లు ఒప్పించారా? అనేది తెలుసుకోవడానికి అప్పట్లో ఆయన కజిన్ ను పంపించారు" అని అన్నారు.
"కృష్ణంరాజు గారు పైకి చాలా గంభీరంగా కనిపిస్తారు గానీ, ఆయన చాలా సెన్సిటివ్. సీతాదేవిగారు చనిపోయిన తరువాత ఆయన డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట. ఇక కృష్ణంరాజు గారు వారి తండ్రిగారి మరణాన్ని అస్సలు తట్టుకోలేకపోయారు. ప్రభాస్ వాళ్ల నాన్నగారు చనిపోయినప్పుడు కూడా కృష్ణంరాజు గారు కుప్పకూలిపోయారు. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి ఆయనకి చాలా సమయం పట్టింది"చెప్పారు.
"సూర్యనారాయణ రాజుగారితో కృష్ణంరాజుగారికి గల అనుబంధం అలాంటిది. తానే డీలాపడిపోతే పిల్లలు ఏమైపోతారోనని ఆయన బాధ నుంచి తేరుకున్నారు. అప్పటి నుంచి పిల్లలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. నన్ను ఆయనను బాధపెట్టిన సందర్భాలు లేవు. ఆయనను విడిచిపెట్టి నేను ఏ ఫంక్షన్ కి వెళ్లింది లేదు. ఆయన లేకుండా నేను ఇలా మిగిలిపోవలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు" అంటూ ఆమె ఉద్వేగానికి లోనయ్యారు.