పద్మభూషణ్ అవార్డును అందుకోవడంపై బాలకృష్ణ స్పందన
- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణ
- సరైన సమయానికే పద్మభూషణ్ పురస్కారం వచ్చిందన్న బాలయ్య
- అభిమానులకు, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ఈ పురస్కారం అందుకోవడం పట్ల బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. తన అభిమానులకు, భారత ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ అవార్డు ఎప్పుడో రావాల్సిందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతుంటారని, అయితే తనకు సరైన సమయంలోనే పద్మభూషణ్ వచ్చిందని తాను భావిస్తున్నట్లు బాలకృష్ణ పేర్కొన్నారు. "వరుసగా నేను నటించిన నాలుగు సినిమాలు ఘన విజయం సాధించడం, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తి కావడం, ముఖ్యంగా నేను సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తయిన ఈ తరుణంలో ఈ పురస్కారం రావడం నాకు ఎంతో ప్రత్యేకం" అని ఆయన వివరించారు.