యూత్ హాకీ ఫైవ్స్ ఆసియా కప్లో భారత్ జోరు.. పాకిస్థాన్పై 7-3తో ఘనవిజయం!
- పాకిస్థాన్పై 7-3 తేడాతో విజయం సాధించిన భారత పురుషుల జట్టు
- ఒమన్పై 10-1తో అద్భుత విజయాన్ని నమోదు చేసిన భారత్
- ఒమన్ పర్యటనలో చెలరేగిన కేతన్ కుష్వాహా, షారూఖ్ అలీ
- చైనా చేతిలో 3-6తో పోరాడి ఓడిన భారత మహిళల జట్టు
- ఎఫ్ఐహెచ్ యూత్ హాకీ5స్ వరల్డ్ కప్ క్వాలిఫయర్గా టోర్నీ
ఎఫ్ఐహెచ్ యూత్ హాకీ ఫైవ్స్ ఆసియా ఛాంపియన్షిప్ 2026లో భారత సబ్జూనియర్ పురుషుల జట్టు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. శుక్రవారం ఒమన్ వేదికగా జరిగిన మ్యాచుల్లో భారత్ రికార్డు విజయాలను సొంతం చేసుకుంది. ఒకే రోజులో మొదట ఆతిథ్య ఒమన్ జట్టును 10-1 తేడాతో చిత్తు చేసిన భారత్, ఆ తర్వాత జరిగిన హై-వోల్టేజ్ పోరులో సంప్రదాయ ప్రత్యర్థి పాకిస్థాన్ను 7-3తో ఓడించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
పాకిస్థాన్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ పూర్తి నియంత్రణ సాధించింది. ప్రథమార్ధంలోనే రోమిత్ పాల్ (8వ నిమిషం), కరణ్ గౌతమ్ (10వ నిమిషం), కెప్టెన్ కేతన్ కుష్వాహా (10వ నిమిషం) మెరుపు గోల్స్ సాధించడంతో భారత్ 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ద్వితీయార్థంలో ప్రహ్లాద్ రాజ్భర్ (12వ నిమిషం) గోల్ కొట్టడంతో స్కోరు 4-0గా మారింది. ఆ తర్వాత పాకిస్థాన్ పుంజుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. షారూఖ్ అలీ (16వ నిమిషం), రాహుల్ యాదవ్ (18వ నిమిషం), కుష్వాహా (20వ నిమిషం) వరుస గోల్స్తో విరుచుకుపడి 7-3తో భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
ఒమన్పై 10-1తో గోల్స్ వర్షం!
అంతకుముందు రోజు జరిగిన మ్యాచ్లో ఆతిథ్య ఒమన్ను భారత జట్టు కకావికలం చేసింది. ప్రథమార్ధంలోనే 6-0 ఆధిక్యంలో నిలిచిన భారత్, మ్యాచ్ ముగిసేసరికి 10-1తో తిరుగులేని విజయాన్ని ఖాయం చేసుకుంది. కెప్టెన్ కేతన్ కుష్వాహా ఏకంగా నాలుగు గోల్స్తో విరుచుకుపడగా.. షారూఖ్ అలీ, కరణ్ గౌతమ్, ప్రహ్లాద్ రాజ్భర్లు తలో రెండు గోల్స్తో చెలరేగారు. ఒమన్ తరఫున చివరి నిమిషంలో ఖజ్రాజ్ ఒక గోల్ సాధించాడు.
చైనా చేతిలో పోరాడి ఓడిన మహిళల జట్టు
మరోవైపు మహిళల విభాగానికి సంబంధించిన ఎలైట్ పూల్ మ్యాచ్లో భారత సబ్జూనియర్ మహిళల జట్టు చైనా చేతిలో 3-6 తేడాతో ఓటమి పాలైంది. ప్రథమార్ధంలో రెండు జట్లు 3-3తో సమానంగా నిలిచి గట్టి పోటీ ఇచ్చాయి. భారత్ తరఫున కిరణ్ ఎక్కా రెండు గోల్స్, సందీప కుమారి ఒక గోల్ సాధించారు. అయితే ద్వితీయార్థంలో చైనా ప్లేయర్ గువో జియాక్సిన్ హ్యాట్రిక్ గోల్స్తో విజృంభించడంతో భారత మహిళలకు ఓటమి తప్పలేదు. తొలిసారిగా జరగనున్న ఎఫ్ఐహెచ్ యూత్ హాకీ ఫైవ్స్ వరల్డ్ కప్కు ఈ టోర్నీ ఆసియా ఖండం తరఫున అర్హత పోటీగా నిలవనుంది.
పాకిస్థాన్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ పూర్తి నియంత్రణ సాధించింది. ప్రథమార్ధంలోనే రోమిత్ పాల్ (8వ నిమిషం), కరణ్ గౌతమ్ (10వ నిమిషం), కెప్టెన్ కేతన్ కుష్వాహా (10వ నిమిషం) మెరుపు గోల్స్ సాధించడంతో భారత్ 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ద్వితీయార్థంలో ప్రహ్లాద్ రాజ్భర్ (12వ నిమిషం) గోల్ కొట్టడంతో స్కోరు 4-0గా మారింది. ఆ తర్వాత పాకిస్థాన్ పుంజుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. షారూఖ్ అలీ (16వ నిమిషం), రాహుల్ యాదవ్ (18వ నిమిషం), కుష్వాహా (20వ నిమిషం) వరుస గోల్స్తో విరుచుకుపడి 7-3తో భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
ఒమన్పై 10-1తో గోల్స్ వర్షం!
అంతకుముందు రోజు జరిగిన మ్యాచ్లో ఆతిథ్య ఒమన్ను భారత జట్టు కకావికలం చేసింది. ప్రథమార్ధంలోనే 6-0 ఆధిక్యంలో నిలిచిన భారత్, మ్యాచ్ ముగిసేసరికి 10-1తో తిరుగులేని విజయాన్ని ఖాయం చేసుకుంది. కెప్టెన్ కేతన్ కుష్వాహా ఏకంగా నాలుగు గోల్స్తో విరుచుకుపడగా.. షారూఖ్ అలీ, కరణ్ గౌతమ్, ప్రహ్లాద్ రాజ్భర్లు తలో రెండు గోల్స్తో చెలరేగారు. ఒమన్ తరఫున చివరి నిమిషంలో ఖజ్రాజ్ ఒక గోల్ సాధించాడు.
చైనా చేతిలో పోరాడి ఓడిన మహిళల జట్టు
మరోవైపు మహిళల విభాగానికి సంబంధించిన ఎలైట్ పూల్ మ్యాచ్లో భారత సబ్జూనియర్ మహిళల జట్టు చైనా చేతిలో 3-6 తేడాతో ఓటమి పాలైంది. ప్రథమార్ధంలో రెండు జట్లు 3-3తో సమానంగా నిలిచి గట్టి పోటీ ఇచ్చాయి. భారత్ తరఫున కిరణ్ ఎక్కా రెండు గోల్స్, సందీప కుమారి ఒక గోల్ సాధించారు. అయితే ద్వితీయార్థంలో చైనా ప్లేయర్ గువో జియాక్సిన్ హ్యాట్రిక్ గోల్స్తో విజృంభించడంతో భారత మహిళలకు ఓటమి తప్పలేదు. తొలిసారిగా జరగనున్న ఎఫ్ఐహెచ్ యూత్ హాకీ ఫైవ్స్ వరల్డ్ కప్కు ఈ టోర్నీ ఆసియా ఖండం తరఫున అర్హత పోటీగా నిలవనుంది.