Rayalaseema Express: రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

Rayalaseema Express Train Robbery Shocks Andhra Pradesh

          


నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ జరిగింది. అనంతపురం జిల్లాలోని గుత్తి వద్ద ఈ తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు లైన్ క్లియర్ చేసేందుకు గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపారు. 

అప్పటికే అక్కడ మాటువేసిన ఐదుగురు దుండగులు రైలులోకి చొరబడ్డారు. మొత్తం పది బోగీల్లో దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణికుల బంగారం, నగదుతోపాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Rayalaseema Express
Train Robbery
Gutthi
Anantapur District
Tirupati
Nizamabad
Railway Police
Crime
Andhra Pradesh
Robbery in Rayalaseema Express
  • Loading...

More Telugu News