ఐపీఎల్లో ఆటగాళ్లకు భద్రత కరవు.. ఈ వీడియో చూడండి!
- రాజస్థాన్-కోల్కతా మ్యాచ్లో సెక్యూరిటీ ఉల్లంఘన
- పిచ్పైకి దూసుకొచ్చి పరాగ్ కాళ్లు పట్టుకున్న అభిమాని
- ఈ ఐపీఎల్లో ఇది రెండో ఘటన
పరాగ్ బౌలింగ్కు సిద్ధమవుతుండగా మైదానంలో ఒక్కసారిగా అరుపులు వినిపించాయి. బ్యాటర్ వెంటనే అప్రమత్తమై పరాగ్ను వారించాడు. ఆ వెంటనే పిచ్ పైకి దూసుకొచ్చిన అభిమాని పరాగ్ కాళ్లు పట్టుకున్నాడు. ఆపై అతడిని బలంగా వాటేసుకున్నాడు. ఈ లోగా మైదానంలోకి వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది అభిమానిని పట్టుకుని లాక్కెళ్లారు. మైదానంలోకి అభిమాని చొచ్చుకురావడం ఇది రెండోసారి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచ్లో ఓ అభిమాని కోహ్లీ కోసం మైదానంలోకి దూసుకొచ్చాడు. ఐపీఎల్లో ఇలా తరచూ భద్రతాపరమైన ఉల్లంఘనలు జరుగుతుండటంతో ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.