జంతర్ మంతర్ నిరసనలో 2,873 మంది నేరస్థులు.. ఫేషియల్ రికగ్నిషన్‌తో బట్టబయలు

2873 criminals in Jantar Mantar protest exposed through facial recognition
  • జంతర్ మంతర్ విద్యార్థుల నిరసనలో నేరస్థుల కలకలం
  • వేల మంది నేర చరిత్ర గల వ్యక్తులు ఉన్నట్టు గుర్తింపు
  • ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా వివరాలు సేకరించిన పోలీసులు
  • వీరిలో 989 మందిపై హత్యCJP
  • , అత్యాచారం వంటి తీవ్రమైన కేసులు
  • అల్లర్లు సృష్టించేందుకు పంపారా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిర్వహించిన నిరసనలో భారీ సంఖ్యలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఉన్నట్టు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. జులై 20 నుంచి 25 మధ్య జరిగిన ఈ ఆందోళనల్లో ఏకంగా 2,873 మంది నేర నేపథ్యం ఉన్న వ్యక్తులు పాల్గొన్నారని పోలీసు వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్), ఇతర సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వీరిని గుర్తించినట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఈ పరిణామం ఢిల్లీ పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు గుర్తించిన ఈ వ్యక్తులలో చాలా మందిపై హత్య, అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు, కిడ్నాప్, దోపిడీ వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. వీరిలో కనీసం 989 మంది అత్యంత తీవ్రమైన నేరాలకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో కొందరు పదేపదే నిరసన ప్రదేశానికి వచ్చి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. విద్యార్థుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా నిరోధించేందుకే జంతర్ మంతర్ వద్ద నిఘా పెంచినట్టు అధికారి వివరించారు.

నిరసన ప్రదేశం యొక్క ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లతో పాటు, నగరంలోని కీలక ప్రాంతాలు, సరిహద్దు ప్రవేశ మార్గాల వద్ద పోలీసులు హై-రిజల్యూషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ఎఫ్ఆర్ఎస్ కెమెరాలు తీసిన చిత్రాలను, వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన నేరస్థులు, పరారీలో ఉన్నవారు, హిస్టరీ-షీటర్ల వివరాలున్న డేటాబ్యాంక్‌తో పోల్చి చూశారు. ఈ ప్రక్రియలోనే ఇంత పెద్ద సంఖ్యలో నేరస్థులు ఆందోళనల్లో పాల్గొన్నట్టు బట్టబయలైంది.

గుర్తించిన వారిలో ఎక్కువ మంది ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్, చాంద్ బాగ్, జాఫ్రాబాద్‌తో పాటు ఆగ్నేయ ఢిల్లీలోని జామియా నగర్, షాహీన్ బాగ్, ఓఖ్లా ప్రాంతాలకు చెందినవారని తేలింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే వీరిని ఉద్దేశపూర్వకంగా నిరసన ప్రదేశానికి పంపారా? లేదా పాకిస్థాన్ నుంచి పనిచేసే సోషల్ మీడియా హ్యాండిల్స్ వీరిని ప్రభావితం చేస్తూ భద్రతా బలగాల గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయా? అనే కోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జులై 20న జంతర్ మంతర్, ఇతర ప్రాంతాలలో జరిగిన హింసాత్మక ఘటనలలో వీరి ప్రమేయం ఉందా అనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Delhi Police
Jantar Mantar
Facial Recognition System
Delhi Students Protest
Criminal Identification
Delhi Security Surveillance

More Telugu News