థ్యాంక్యూ చంద్రబాబు గారూ.. మీ శిష్యుడికి అవగాహన కల్పించండి.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
గత దశాబ్ద కాలంగా ప్రగతిశీల ప్రభుత్వ విధానాల వల్ల దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని కేటీఆర్ అన్నారు. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావించారని గుర్తు చేస్తూ ఆయన మాట్లాడిన వీడియోను తన ట్వీట్కు జోడించారు కేటీఆర్.
"థ్యాంక్యూ చంద్రబాబు గారూ.. దయచేసి ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని మీ పూర్వ శిష్యుడికి దీనిపై అవగాహన కల్పించండి" అని ట్వీట్లో రాసుకొచ్చారు.