వందేభారత్ రైల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు మాధవీలత భజన... వీడియో ఇదిగో!

Madhavi Latha recites Bhajans while traveling in Vande Bharat train from Secunderabad to Tirupati
  • సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు రైల్లో ప్రయాణం చేసిన మాధవీలత
  • మాధవీలత భజనతో మార్మోగిన వందేభారత్ రైలు
  • మాధవీలత అనుచరులతో నిండిపోయిన ఓ కంపార్ట్ మెంట్
తెలంగాణ బీజేపీ నేత మాధవీలత వందేభారత్ రైల్లో హరే రామ హరే కృష్ణ అంటూ భజన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మాధవీలత సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు వందేభారత్ రైల్లో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆమె రైల్లో ఆ చివర నుంచి ఈ చివర వరకు భజన చేస్తూ తిరిగారు. 

ఈ సందర్భంగా ఆమె వెంట పలువురు అనుచరులు కూడా ఉన్నారు.  సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలంతా మాధవీలత భజనతో మార్మోగిపోయింది. దాదాపు ఓ కంపార్ట్ మెంట్ మాధవీలత అనుచరులతో నిండిపోయింది. ఆమె కాసేపు గోవిందా గోకుల నందా అంటూ కూడా భజన చేశారు.
Go Back to Shorts
Madhavi Latha
Bhajan
Vande Bharat Train
Secunderabad
Tirupati
BJP
Hyderabad
Telangana

More Telugu News