Advertisement

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా... కేంద్ర విద్యాశాఖ నూతన మంత్రిగా ప్రహ్లాద్ జోషి

Dharmendra Pradhan resigns Pralhad Joshi appointed as new Union Education Minister
  • నీట్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
  • నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు
  • ప్రధాన్ రాజీనామాను తక్షణమే ఆమోదించిన రాష్ట్రపతి
  • కార్క్రోచ్ జనతా పార్టీ నిరసనలతో పెరిగిన ఒత్తిడి
  • ప్రస్తుతం ఆహారం, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రిగానూ జోషి బాధ్యతలు
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వివాదం కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పుకు దారితీసింది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం నేపథ్యంలో, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. అనంతరం, ఆయన స్థానంలో సీనియర్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలను అప్పగిస్తూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది.

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తన రాజీనామాను సమర్పించారు. ప్రధానమంత్రి సలహా మేరకు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(2) ప్రకారం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి తక్షణమే ఆమోదించారు.

నూతన విద్యాశాఖ మంత్రిగా నియమితులైన 64 ఏళ్ల ప్రహ్లాద్ జోషి, కర్ణాటకలోని ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2004 నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా (2019-2024) సమర్థంగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఆహార (ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన), పునరుత్పాదక ఇంధన (పీఎం సూర్య ఘర్ యోజన) శాఖల మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కర్ణాటకలో మధ్యాహ్న భోజన పథకాలతో ఆయనకు గతంలో అనుబంధం ఉంది.

ఈ నియామక ప్రకటన వెలువడే సమయానికి ప్రహ్లాద్ జోషి తన నియోజకవర్గంలో పర్యటనలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఆయన పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని, హుబ్లీ నుంచి రాత్రి 7:30 గంటల విమానంలో ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు. ఈ సందర్భంగా 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ, ధర్మేంద్ర ప్రధాన్ పదవీకాలంలో నూతన జాతీయ విద్యా విధానం (NEP 2020) అమలుతో పాటు అనేక సంస్కరణలు జరిగాయని ప్రశంసించారు.
Advertisement
Dharmendra Pradhan
Pralhad Joshi
Union Education Minister
NEP 2020
NEET paper leak controversy
Ministry of Education

More Telugu News