మళ్లీ ఉచిత ఇసుక విధానం: చంద్రబాబు కీలక నిర్ణయం
- ఈ నెల 8వ తేదీ నుంచి అమలు చేయాలని దాదాపు నిర్ణయం
- ఉచిత ఇసుక పంపిణీకి విధివిధానాలు తయారు చేస్తున్నట్లు మంత్రి వెల్లడి
- ప్రతి ఒక్కరికీ ఉచిత ఇసుక ఇవ్వాలని నిర్ణయించినట్లు కొల్లు రవీంద్ర వెల్లడి
ఇసుక పంపిణీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు: కొల్లు రవీంద్ర
ఇసుక విధానంతో ఐదేళ్ళుగా పేద ప్రజలను దోచుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఉచిత ఇసుక పంపిణీకి విధివిధానాలను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇసుక పంపిణీపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఇసుక నిల్వ కేంద్రాలపై దృష్టి సారిస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ ఉచిత ఇసుక ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుందని ఆరోపించారు.
ఇసుక పంపిణీలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వర్షాలు పడినా ఇసుక పంపిణీకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఉచిత ఇసుక పంపిణీలో సాంకేతిక సమస్యలు రాకుండా చూసుకుంటామన్నారు