పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై మోదీ స్పందన
- చాలా సీరియస్ ఇష్యూ అన్న ప్రధాని
- దీనిపై రాజకీయం చేయొద్దంటూ ప్రతిపక్షాలకు హితవు
- సమగ్ర విచారణకు ఆదేశించినట్లు వెల్లడి
ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు మోదీ వివరించారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సెక్యూరిటీ సిబ్బందికి సూచించామన్నారు. మరోవైపు, పార్లమెంట్ లోపలా బయటా అలజడి సృష్టించిన ఈ కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకున్నారు. వీరిలో స్మోక్ అటాక్ సూత్రధారి లలిత్ ఝాను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ సెల్ దర్యాప్తు జరుపుతోంది.