అహ్మదాబాద్లో భారత్-పాక్ మ్యాచ్ నేపథ్యంలో భారతీయ రైల్వే శుభవార్త!
- అక్టోబర్ 5న నరేంద్రమోదీ స్టేడియంలో దాయాదుల పోరు
- మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల నుంచి ప్రత్యేక వందే భారత్ రైలు
- త్వరలో రైళ్ల షెడ్యూల్, టిక్కెట్ ధరల వివరాల వెల్లడి
ఆ రోజున వందే భారత్ రైలును నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే రైళ్ల షెడ్యూల్, టిక్కెట్ ధరల వివరాలను వెల్లడించనున్నామన్నారు. భారత్ - పాక్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్లో హోటళ్ల ధరలు భారీగా పెరగడం, విమాన టిక్కెట్ ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో వాటి నుంచి ఉపశమనం కలిగించేందుకు వందే భారత్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు.