Nadendla Manohar: వన్ నేషన్, వన్ ఎలక్షన్‌పై జనసేన నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు

  • వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ను జనసేన సమర్థిస్తుందన్న నాదెండ్ల
  • ఒకేసారి ఎన్నికలు జరిగితే ధనం ఆదా, ప్రజలకు మేలు అని వెల్లడి
  • పార్లమెంటులో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్న నాదెండ్ల
Janasena will support one nation and one election

వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ను జనసేన సమర్థిస్తుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ నినాదానికి సంబంధించి కేంద్రం సమాలోచనలు జరుపుతోందన్నారు. ఈ అంశంపై కేంద్రం పెద్దలు తమతో చర్చలు జరిపారన్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగితే ధనం ఆదా అవుతుందని, అలాగే ప్రజలకూ మేలు జరుగుతుందన్నారు. అందుకే వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ను జనసేన సమర్థిస్తుందన్నారు.

అయితే ఈ విషయంపై పార్లమెంటులో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జమిలి ఎన్నికలపై చాలా రోజులుగా చర్చ సాగుతోందన్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై స్పందిస్తూ... త్వరలో తేదీలను ఖరారు చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో పరిస్థితులను బట్టి పొత్తులు ఉంటాయన్నారు.

  • Loading...

More Telugu News